1.జగిత్యాల లో పెద్ద పులి సంచారం
జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండలం సంగేమ్ గ్రామ శివారులో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది.
2.గణేష్ నిమజ్జనం పై హైకోర్టులో విచారణ
గణేష్ నిమజ్జనం పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.
3.తానా 25 కోట్ల విరాళం
ఏపీ తెలంగాణలో ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య పరికరాల కొనుగోలు నిమిత్తం 25 కోట్ల విరాళం తానా అందించనుంది.
4.జూపార్క్ కు నాగబాబు విరాళం
ప్రముఖ సినీ నటుడు కొణిదెల నాగబాబు హైదరాబాదులోని జూ పార్క్ సందర్శించారు.ఈ సందర్భంగా సెనెగల్ ప్యారెట్ జత కొనుగోలు కోసం 35 వేల రూపాయల చెక్కును జూ క్యూరేటర్ కు అందజేశారు.
5.మిడ్ మానేరు జలాశయం గేట్లు ఎత్తివేత
రాజన్న సిరిసిల్ల లో ఉన్న మిడ్ మానేరు జలాశయం కి భారీగా వరద నీరు రావడంతో ప్రాజెక్టు ఎనిమిది గేట్లు ఎత్తివేశారు.
6.నేడు ఢిల్లీకి కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
7.బస్ పాస్ ల నిమిత్తం 40 కౌంటర్లు
ఆన్లైన్ లో బస్సుల కోసం దరఖాస్తులు చేసుకున్న విద్యార్థుల కోసం తెలంగాణ ఆర్టీసీ అధికారులు 40 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు.
8.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.నన్ను తిరుమల శ్రీవారిని 20,638 మంది భక్తులు దర్శించుకున్నారు.
9.7న చలో హైదరాబాద్
ఈనెల ఏడో తేదీన నిర్వహించతలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ పిలుపునిచ్చింది.
10.ఈ శ్రమ్ పోర్టల్ లో పేర్ల నమోదు ప్రారంభం
ముషీరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ శ్రమ్ పోర్టల్ లో అసంఘటిత రంగ కార్మికుల పేర్లు నమోదు ను కేంద్ర రాష్ట్ర మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు చంద్రమౌళి ప్రారంభించారు.
11.జగన్ ను కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు
ఏపీ సీఎం జగన్ కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
12.కన్న బాబుకి దమ్ముంటే.
కన్న బాబుకు దమ్ముంటే జగన్ ఇచ్చిన హామీలు పై చర్చకు రావాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ చేశారు.
13.ఏపీలో 40 మంది డీఎస్పీల బదిలీ
ఏపీలో 40 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
14.నేడు కడపలో జగన్ పర్యటన
ఏపీ సీఎం జగన్ నేడు కడప జిల్లాలోని ఇడుపులపాయకు రానున్నారు.
15.వ్యవసాయ శాఖ పై జగన్ సమీక్ష
వ్యవసాయ శక్తి ఏపీ సీఎం జగన్ నేడు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
16.సముద్రంలో కూలిన హెలికాప్టర్
అమెరికా మిలటరీ హెలికాప్టర్ బుధవారం ప్రమాదవశాత్తు సముద్రంలో కూలిపోయింది.
17.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 41, 965 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
18.టాలీవుడ్ డ్రగ్స్ కేసు
సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న కెల్విన్ అప్రూవర్ గా మారినట్టు తెలుస్తోంది.
19.పెరిగిన గ్యాస్ ధర
దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల ధరలు మళ్లీ పెరిగాయి.వంట గ్యాస్ సిలిండర్ పై 25 , వాణిజ్య గ్యాస్ పై 75 పెరిగింది.
20. ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,370 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,370