1.ఈడీ విచారణకు ఛార్మీ
టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఈడీ అధికారులు ఎదుట సినీ నటి ఛార్మి హాజరయ్యారు.
2.హైటెక్స్ నోవాటెల్ లో వైఎస్ సంస్మరణ సభ
హైటెక్ సిటీ లోని నోవా టెల్ లో వైఎస్ సంస్మరణ సభ నేటి సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించనున్నారు.
3.చేవెళ్ల నుంచి ప్రజా సంగ్రామ యాత్ర
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర నేడు చేవెళ్ల మోడల్ కాలనీ నుంచి ప్రారంభం కానుంది.
4.వీఆర్వోల ఆత్మగౌరవ సభ
తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం నష్టం చేకూర్చే విధంగా వ్యవహరిస్తోందని, దీన్ని నిరసిస్తూ ఉద్యోగ సంఘాలు రాజకీయ పార్టీల నాయకులతో కలిసి ఈ నెల మొదటి వారంలో ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్లు తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షులు సతీష్ , నరేష్ తెలిపారు.
5.భూ రీసర్వే
వివాదాలకు తావులేకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రీ సర్వే సమగ్రం గా పూర్తి చేయాలని రాష్ట్ర సర్వే సెటిల్మెంట్ కమిషనర్ సిద్దార్ జైన్ అన్నారు.
6.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.బుధవారం తిరుమల శ్రీవారిని 21,463 మంది భక్తులు దర్శించుకున్నారు.
7.మారనున్న ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్
తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీలకు గుర్తింపునకు జారీ చేసే ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో, ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ లో మార్పులు జరిగే అవకాశం ఉంది.
8.మరో నాలుగు మండలాల్లో ‘ దళిత బంధు ‘
దళిత బంధు పథకాన్ని మరో నాలుగు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.చింతకాని, తిరుమలగిరి , చారకొండ , నిజాంసాగర్ లో దళిత బందు అమలుచేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
9.సోషల్ మీడియా పై షర్మిల స్పందన
పార్టీ బలోపేతానికి సోషల్ మీడియా ఒక చక్కటి వేదిక అని వైఎస్ఆర్ టీపి అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు.
10.హుజురాబాద్ లో పోటీ చేయడం లేదు
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో సిపిఐ పోటీ చేయడం లేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు.
11.టిఎస్పీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించిన పీఈటీ అభ్యర్థులు
టిఎస్పీఎస్పీ కార్యాలయాన్ని టిడిపి అభ్యర్థులు ముట్టడించారు ఫలితాలను వెంటనే ప్రకటించి నియామకాలను పూర్తి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
12.హరీష్ రావు పై ఈటెల రాజేందర్ సంచలన కామెంట్స్
” హరీష్ రావు నీ చరిత్ర బయట పెడతా, నా మీద చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధం.హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర అన్ని ఏర్పాట్లు నేను చేస్తా ” అంటూ తెలంగాణ మంత్రి హరీష్ రావు పై ఈటెల రాజేందర్ విమర్శలు చేశారు.
13.తిరుపతి లో తమిళ స్మగ్లర్ల అరెస్ట్
చిత్తూరు జిల్లా వడమాల మండలం అంజీర్ అమ్మకం వద్ద ఎర్రచందనం కోసం అడవిలోకి వెళ్లేందుకే ప్రయత్నించిన 21 మంది తమిళ స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
14. వైఎస్ పై రేవంత్ ప్రశంసలు
దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు.వైఎస్ ఆకాంక్ష నెరవేర్చేందుకు పనిచేస్తానని ఈ సందర్భంగా రేవంత్ వ్యాఖ్యానించారు.
15.13 వరకు బెంగళూరులో నైట్ కర్ఫ్యూ
కోటి నియంత్రణలో భాగంగా ఈ నెల 13వ తేదీ వరకు బెంగళూరు నగర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ తెలిపారు.
16.బిగ్ బాస్ విన్నర్ మృతి
బాలీవుడ్ నటుడు, ప్రముఖ రియాల్టీ షో ‘ బిగ్ బాస్ 13 ‘ సీజన్ విద్యార్థులు సిద్ధార్థ శుక్ల (40) కన్నుమూసారు.
17.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 47, 092 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
18.సి సి ఎస్ రద్దు కోరుతూ నిరసన
సి సి ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు.
19.బిజేపి ఎంపీ పై సుమొటో కేసు
భైంసా లో బీజేపీ ఎంపీ బాబు రావు పై సుమోటా గా కేసు నమోదయ్యింది.నిన్న బైంసా అల్లర్ల బాధితుల గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న బాబురావు ఈ సందర్భంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేశారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,380 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ,- 47,380
.