1.ఢిల్లీలో కీలక న్యాయ సదస్సు
ఈరోజు ఢిల్లీలో కీలక న్యాయ సదస్సు జరగనుంది.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సదస్సు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తదితరులు పాల్గొనబోతున్నారు.
2.టీటీడీ పాలక మండలి సమావేశం
ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం జరగనుంది.64 అంశాలతో అజెండాను అధికారులు రూపొందించారు.
3.ఎస్వి క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభం
మే ఐదో తేదీన ఏపీ సీఎం జగన్ చేతుల మీదుగా చిన్న పిల్లల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి , ఎస్వి క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభోత్సవం జగన్ చేయనున్నారు.
4.సింహాచలం లో చందనోత్సవం టికెట్ల అమ్మకాలు
విశాఖలోని సింహాచలం దేవస్థానంలో చందనోత్సవం టికెట్ల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.సింహాచలం ఎస్బిఐ , యూనియన్ బ్యాంకు ల ద్వారా 300 రూపాయలు టిక్కెట్ల విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
5.నవోదయ పరీక్ష
తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు నవోదయ పరీక్ష జరగనుంది ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1.00 వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు.
6.పై విమర్శల పై కేటీఆర్ పశ్చాత్తాపం
ఎవరినీ బాధపెట్టాలని తను ఏపీలో పై విమర్శలు చేయలేదని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
7. బియ్యం సేకరించం : ఎఫ్ సీ ఐ
ధాన్యం నిల్వ పెట్టే వరకు ఆయా నెల్లూరు బియ్యాన్ని సహకరించేది లేదని ఎఫ్ సీ ఐ ప్రకటించింది.
8.ధాన్యం సేకరణకు 2,384 కేంద్రాలు
తెలంగాణ వ్యాప్తంగా 2,384 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యాయి.
9.కూలీల సొమ్ము పై షర్మిల కామెంట్స్
పని చేయించుకుని కూలీల సొమ్ము ను ఇవ్వడం లేదని, కోలాలకు సొమ్ములు చెల్లించలేని స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
10.తెలంగాణలో కరెంటే పోవడం లేదు : దానం
తెలంగాణలో కనురెప్ప పాటులో కూడా కరెంట్ పోవడం లేదని తెలంగాణ మంత్రి దానం నాగేందర్ అన్నారు.
11.వైసీపీ నేతలకు తలసాని కౌంటర్
ఏపీ వైసీపీ నేతలకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు.మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఏపీ నేతలు కావాలనే రాజకీయం చేస్తున్నారని తలసాని వ్యాఖ్యానించారు.
12.తెలంగాణ విద్యా శాఖ పై రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ
తెలంగాణ విద్యాశాఖ పై రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది.
13.కేటీఆర్ చెప్పినవన్నీ నిజాలే
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీ సమస్యల గురించి చెప్పిన విషయాలన్నీ నిజమేనని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యానించారు.
14.ముంబై లో శ్రీవారి ఆలయానికి స్థలం కేటాయింపు
ముంబై లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి పది ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
15.వైసీపీ ఎమ్మెల్యే పై దాడి
ఏలూరు ( పశ్చిమ గోదావరి ) జిల్లా గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.జి కొత్తపల్లి వైసిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు గంజి ప్రసాద్ ను కొంతమంది నరికి చంపడం తో పరామర్శించేందుకు వెళ్ళిన ఎమ్మెల్యే పై దాడి జరిగింది.
16.సీపీఐ నారాయణ కామెంట్స్
తమిళనాడు లో రోడ్లు బాగున్నాయని, ఏపీలో గుంతల రోడ్లే అని సీపీఐ నారాయణ కామెంట్స్ చేశారు.
17.నారా లోకేష్ కామెంట్స్
పదవ తరగతి పరీక్ష బాక్సులను విద్యార్థులతో మోయిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు
18.కేసిఆర్ వ్యాఖ్యలపై జగన్ స్పందించాలి
తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ స్పందించాలి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
19.‘పరమార్థం ‘ పుస్తకావిష్కరణ ‘
రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కె ఆర్ బీ హెచ్ ఎన్ చక్రవర్తి రాసిన ‘ పరమార్థం ‘ అనే పుస్తకాన్ని శుక్రవారం రాజ్ భవన్ లో ఏపీ గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ ఆవిష్కరించారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,400 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 52,800
.