1.ఉద్యోగుల ఆరోగ్య పథకం ఆరు నెలల పొడిగింపు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పథకాన్ని ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది.
2.ఓయూలో స్వెరోస్ విద్యార్థులు భీమ్ దీక్ష
ఓయూలో స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో భీమ్ దీక్షను నిర్వహించారు.
3.23 నుంచి దివ్యాంగుల ఢిల్లీ యాత్ర
దివ్యాంగులకు గ్రామస్థాయి నుంచి పార్లమెంటు వరకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు ఢిల్లీలో యాత్ర నిర్వహిస్తున్నట్లు అఖిల భారత దివ్యంగా హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు నాగేశ్వరరావు వెల్లడించారు.
4.’ కళ్యాణమస్తు ‘ జంటలకు బంగారు మంగళ సూత్రం
త్వరలో దేశవ్యాప్తంగా టీటీడీ నిర్వహించనున్న కల్యాణమస్తు కార్యక్రమం లో పాల్గొనే ప్రతి జంటకు రెండు గ్రాముల బంగారం మంగళసూత్రం అందజేయాలని నిర్ణయించారు.
5.అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యంపై ఆందోళన
అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఆరోగ్యం పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.ప్రసంగాలలో ఆయన తరచుగా తడబడటం, హోదాలు, పేర్లు చెప్పే విషయంలో తికమక పడడం వంటివి ఈ అనుమానాలు కలిగిస్తున్నాయి.
6.జగన్ అక్రమాస్తుల కేసు విచారణ
సిబిఐ ఈడి కోర్టులో సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది లేపాక్షి ఛార్జ్ షీట్ లో బీపీ ఆచార్యపై పిసి చట్టం సెక్షన్లు నమోదు చేశారు.
7.విద్యుత్ ఉద్యోగుల సంఘం సమ్మె నోటీసులు
విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ విద్యుత్ సంస్థలకు సమ్మె నోటీసులు ఇచ్చింది.
8.26న భారత్ బంద్
మూడు వ్యవసాయ చట్టాలు 4 కార్మిక కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను రద్దు చేయాలని పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 26 న తలపెట్టిన భారత్ బంద్ విజయవంతం చేయాలని కర్నూలు కార్మిక, కర్షక భవన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించారు.
9.నేటి నుంచి అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ లో ప్రశ్నోత్తరాలు జీరో అవర్ జరగనుంది.అనంతరం బడ్జెట్ పై చర్చ జరుగుతుంది.
10.టీడీపీ కార్పొరేటర్ల కు షోకాజ్ నోటీసులు
విశాఖ కార్పొరేషన్ గాజువాక పరిధిలో నూతనంగా ఎన్నికైన టిడిపి కార్పొరేటర్లు ఏడుగురు శుక్రవారం వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని కలవడంపై వారికి షోకాజ్ నోటీసు పార్టీ జారీ చేసింది.
11.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 40,953 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
12.తెలంగాణలో కరోనా
తెలంగాణ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
13.బండి సంజయ్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్
ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ ను విమర్శించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలంటూ టియెస్ పీయే తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి ఆనంద్ డిమాండ్ చేశారు.
14.హిందీ పండిట్ అభ్యర్థుల ధృవ పత్రాల పరిశీలన
22 నుంచి హిందీ పండిట్ పోస్టుల భర్తీకి ఈ నెల 22 నుంచి 24 వరకు ఐదో విడత ధృవ పత్రాల పరిశీలన ఉంటుంది అని టిఎస్పీఎస్ తెలిపింది.
15.అమరావతి దీక్షలు
ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలి అని రైతులు, మహిళలు, రైతు సంఘాలు చేపట్టిన నిరసన దీక్షలు నేటికీ 459 వ రోజుకి చేరుకున్నాయి.
16.అన్నాడీఎంకే కు బ్రాహ్మణ సంఘం మద్దతు
తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఏంకే కూటమికి తెలంగాణ బ్రాహ్మణ సంఘం మద్దతు తెలుపుతూ తీర్మానం చేసింది.
17.విమానయానం మరింత ప్రియం
విమాన ప్రయాణం మరింత భారం కానుంది.విమాన కనిష్ట ధరల పరిమితి 5 శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
18.కేటీఆర్ ను కలిసిన గంటా శ్రీనివాసరావు
టీడీపీ మాజీ మంత్రి విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ రోజు తెలంగాణ మంత్రి గంటా శ్రీనివాసరావు ను కలిశారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
19.హై కోర్ట్ లో నిమ్మగడ్డ పిటిషన్
ఏపీ హై కోర్టు లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన పిటిషన్ దాఖలు చేశారు.తాను గవర్నర్ తో జరుపుతున్న ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ బయటకి లీక్ అవుతుండడం పై విచారణ చేయించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 43,930
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 44,930.