ఉద్యోగ వృత్తిని వదిలి రాజకీయాల్లో రాణించి ఎమ్మెల్యేగా మారాడు.కరోనా విజృంభిస్తున్న తరుణంలో పేషంట్ల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు మళ్లీ డాక్టర్ గా అవతారం ఎత్తాడు.
ప్రస్తుతం అలా ఉంది పరిస్థితి మరి.ప్రజల సేవే లక్ష్యంగా పెట్టుకున్న ఎమ్మెల్యే డాక్టర్ గా మారి పేషంట్లకు పరీక్షలు నిర్వహించాడు.
అనంతరపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డి వృత్తిరీత్యా వైద్యుడు.వైఎస్సార్ సీపీ పార్టీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి బుధవారం కదిరిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రభుత్వం కోవిడ్ ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందిస్తోంది.
దీంతో ఎమ్మెల్యే కోవిడ్ బాధితుల స్థితిగతులను తెలుసుకునేందుకు పాలిటెక్నిక్ కళాశాలకు చేరుకున్నారు.కరోనా బాధితులకు అందుతున్న ట్రీట్మెంట్ పై ఆరాతీశారు.
ఆస్పత్రి సౌకర్యాలపై వైద్యులతో కలిసి చర్చించారు. అనంతరం ఆయన పీపీఈ కిట్ ను ధరించి ఒక డాక్టర్ తో పాటు మరో ఇద్దరు నర్సులను వెంటబెట్టుకుని కోవిడ్ ఐసోలేషన్ వార్డుకు వెళ్లి బాధితులను పరీక్షించారు.
కొందరు రోగుల ఆరోగ్య పరిస్థితిని కూడా చెక్ చేసి చూశాడు.అనంతరం వైద్యులు చికిత్స ఎలా చేస్తున్నారని, సమయానికి అన్ని సదుపాయాలు అందుతున్నాయా అని బాధితులతో అడిగి తెలుసుకున్నారు.
మెరుగైన వైద్యం అందించాలని, రోగులకు పౌష్టిక ఆహారాన్ని అందించాలని డాక్టర్లను ఆదేశించారు.