కరోనా వైరస్ నియంత్రించేందుకు లాక్ డౌన్ అమలు చేయగా.ఈ లాక్ డౌన్ కారణంగా ఎక్కువ శాతం నష్టపోయిన రంగం ఏంటి అంటే? వ్యవసాయ రంగం అనే చెప్పాలి.ఈ కరోనా ప్రభావం కారణం రైతులు నష్టాల్లో కూరుకుపోయారు.పెట్టిన పంట తక్కువ రేటుకు పోయి నష్టపోయారు.అయితే ఇంకా ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఏ రైతు నష్టపోకుండా ముందస్తు నిర్ణయం తీసుకున్నారు.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే. ఏపీలో వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చెయ్యాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.దీంతో మార్కెట్ పరిస్థితులను విశ్లేషించి, ఏ పంటలకు ఎంత డిమాండ్ ఉంటుందన్న ముందస్తు అంచనాలతో రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వడానికి.రాష్ట్రం, జిల్లా, మండల స్థాయిలో ఈ వ్యవసాయ మండళ్లు ఏర్పాటు కానున్నాయి.
ఇక పంట వేసేటప్పుడే ధర ప్రకటించి.ఆ రైతుకు ఆ ధర దక్కేలా చూడాలని సీఎం జగన్ తెలిపారు.
దీంతో రైతులకు నష్టం జరగకుండా ఈ ఆలోచన బాగుంది అని నెటిజన్లు కూడా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.