కరోనా దెబ్బకు విద్యా వ్యవస్థ కూడా అస్థవ్యస్థం అయింది.గత ఏడాది పరీక్షలు లేకుండానే దేశ వ్యాప్తంగ చాలా రాష్ట్రలోని విద్యార్థులు పై తరగతులకు ప్రమోట్ అయ్యారు.
ఇక ఏపి లోనూ ఇదే పరిస్థితి.ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలు ఉంటాయా లేకపోతే గత ఏడాది లాగే పై తరగతులకు ప్రమోట్ చేస్తారా అనే విషయంపై ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అమరావతిలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశాడు.ఈ ఏడాది పదవతరగతి పరీక్షలు ఖచ్చితంగా జరుగుతాయని మే నెలలో నిర్వహిస్తాం అన్నారు.మరో వారం రోజుల్లో పరీక్షలకు సంబందించిన షెడ్యూల్ నూ విడుదల చేస్తాం అన్నారు కాకపోతే 11 పేపర్లు పెట్టాల 6 పేపర్లు పెట్టాల అనే విషయంపై విద్యాశాఖ అధికారులతో చర్చలు జరిపి త్వరలో నిర్ణయం తీసుకుంటాం అన్నాడు.