మంచి మాట చెప్పిన రాజుగారు

రాజుగారు అంటే పూర్వ కాలం నాటి రాజు కాదు.టీడీపీ నాయకుడు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు.

 Anyone With Humanism Will Condemn Dadri Incident-TeluguStop.com

ఈయన ఇతర నాయకుల్లా ఎక్కువ మాట్లాడరు.రెచ్చగొట్టే ప్రకటనలు చేయరు.

భాజపా మిత్ర పక్షమైన టీడీపీకి చెందిన వాడు అయినా మోడీకి అదే పనిగా భజన చేయరు.ఇక అసలు విషయానికి వస్తే ….

యూపీలోని దాద్రీలో ఆవు మాంసం తిన్నాడనే ప్రచారంతో ఒక ముస్లీమును కొందరు చంపారు.ఇది దేశంలో సంచలనం కలిగించింది.

అయితే ఎక్కువ మంది భాజపా నాయకులు దీన్ని ఖండించలేదు.కొందరు ఇంకా రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు.

ఆవు మాంసం తిన్నాడు కాబట్టి చంపారని కొందరు అన్నారు.అయితే అశోక్ గజపతి రాజు మాత్రం మానవత్వం ఉన్న ప్రతి మనిషి ఈ దారుణ ఘటనను ఖండించాలని చెప్పారు.

ఈ ఘటన దురదృష్టకరమని, విచారకరమని ఆవేదన వెలిబుచ్చారు.ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకూడదని అన్నారు.

విమానయాన శాఖ సహాయ మంత్రి మహేష్ శర్మ ఈ ఘటన అనుకోకుండా జరిగిందని కామెంట్ చేశారు.ప్రధాని మోడీ కూడా విచారం వ్యక్తం చేసినా ఆయన పార్టీ నాయకులు కొందరు వివాదం కొనసాగిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube