నిశ్శబ్దం నిర్మాతలు ఓటీటీకి ఫిక్స్... అనుష్కాకి మరో ఆప్షన్ లేదు

స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన పాన్ ఇండియా మూవీ నిశ్శబ్దం.ఈ మూవీని ఇండో-హాలీవుడ్ మూవీగా నిర్మాతలు తెరకెక్కించారు.

 Anushka's Nishabdham To Release On Ott, Tollywood, Bollywood, Anushka, Hemanth M-TeluguStop.com

అనుష్క కెరియర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో మాధవన్ కీలక పాత్రలో నటించారు.అలాగే హాలీవుడ్ స్టార్స్ కూడా సినిమాలో నటించారు.

అమెరికా నేపధ్యంలో ఈ సినిమా కథ మొత్తం నడుస్తుంది.ఇందులో అనుష్క ఒక మూగ అమ్మాయి పాత్రలో పెయింటర్ గా కనిపించబోతుంది.

ఇప్పటికే ఈ సినిమా టీజర్ సినిమా మీద అంచనాలు పెంచింది.అయితే సినిమా రిలీజ్ చేసే సమయానికి కరోనా పరిస్థితుల కారణంగా థియేటర్లు మూత పడటంతో వాయిదా పడింది.

విజువల్ వండర్ గా ఈ సినిమాని దర్శకుడు హేమంత్ మధుకర్ ఆవిష్కరించడంతో దీనిని ఎలా అయినా థియేటర్ లోనే రిలీజ్ చేయాలని ఇన్ని రోజుల నుంచి భావిస్తున్నారు.

అయితే పరిస్థితులు రోజురోజుకి మరింత కఠినంగా మారిపోతున్నాయి.

కరోనా తీవ్రంగా విస్తరిస్తుంది.ఇప్పట్లో వాక్సిన్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

దీంతో థియేటర్లు ఓపెన్ చేయడానికి అవకాశం లేదు.ఈ నేపధ్యంలో నిర్మాతలు ఇప్పటికే ఓటీటీలో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు.

సినిమాకి పెద్ద మొత్తంలోనే ఆఫర్ రావడంతో ఒటీటీకి ఇచ్చేయాలని అనుకున్నారు.అయితే అనుష్క ఈ విషయంలో అభ్యంతరం చెప్పడంతో కొంత కాలం వేచి చూశారు.

ప్రస్తుతం అనుష్కాకి కూడా మరో ఆప్షన్ లేక పోవడం వల్ల అయిష్టంగానే ఓటీటీలో రిలీజ్ కి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.దీంతో నిర్మాతలు కూడా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ తో బేరం కుదుర్చుకొని పెద్ద మొత్తంలోనే రైట్స్ రూపంలో తీసుకున్నట్లు సమాచారం.

ఈ నేపధ్యంలో వచ్చే నెలలో నిశ్శబ్దం సినిమాని రిలీజ్ చేయడానికి అమెజాన్ ప్రైమ్ సిద్ధం అవుతుందని టాక్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube