పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో రీఎంట్రీ ఇస్తూ వరుసబెట్టి సినిమాలను క్యూలో పెట్టే పనిలో పడ్డాడు.ఇప్పటికే బాలీవుడ్ మూవీ ‘పింక్’ను తెలుగులో వకీల్ సాబ్ అనే టైటిల్తో రీమేక్ చేస్తున్నాడు.
ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు.కాగా ఈ సినిమా పూర్తికాకముందే తన నెక్ట్స్ మూవీని స్టార్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్లో నటించేందుకు రెడీ అయ్యాడు.
అయితే ఈ సినిమాను అఫీషియల్గా ఇప్పటికే ప్రారంభించినా రెగ్యులర్ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు.ఇక ఈ సినిమాలో హీరోయిన్గా చాలా మంది పేర్లు వినిపించినా చివరకు బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నాండెజ్ దగ్గర వచ్చి ఆగాయి.
అయితే ఈ సినిమాలో ఆమె హీరోయిన్గా కన్ఫం అయ్యిందా లేదా అనే విషయంపై క్లారిటీ రాలేదు.కాగా ప్రస్తుతం చిత్ర యూనిట్ మరో స్టార్ బ్యూటీ అనుష్కను ఈ సినిమాలో నటించాల్సిందిగా కోరారట.
దీంతో ఈ సినిమాలో హీరోయిన్గా అనుష్క నటిస్తుందా అనే సందేహం మళ్లీ మొదలైంది.
అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, అందులో భాగంగానే బాలీవుడ్ బ్యూటీతో పాటు టాలీవుడ్ స్వీటీ కూడా ఈ సినిమాలో నటిస్తుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
గతంలో క్రిష్ డైరెక్షన్లో అనుష్క నటించిన సంగతి తెలిసిందే.అందుకే క్రిష్ అడిగిన వెంటనే స్వీటీ ఓకే అనేసిందని తెలుస్తోంది.
కాగా ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.ఇక ఈ సినిమాలో పవన్ రాబిన్హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నాడట.