అనుష్క దాదాపు పది సంవత్సరాల పాటు తెలుగులో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.ప్రభాస్ తో ఈమె నటించిన మిర్చి తర్వాత సినిమాల విషయంలో చాలా నిరాశపరుస్తూ వచ్చింది.
బాహుబలి సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ ఆ హిట్ ని ఆమె క్యాష్ చేసుకోలేక పోయింది.భారీ అంచనాల నడుమ విడుదలైన భాగమతి సినిమాలో ఆమె భారీ కాయంతో కనిపించడం వల్ల ప్రేక్షకులు బాబోయి అన్నారు.
ఆ తర్వాత గ్యాప్ తీసుకుని ఇటీవలే నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.భారీ అంచనాల నడుమ వచ్చిన నిశబ్దం నిరాశ పరిచింది.
అమెజాన్ ప్రైమ్ ద్వారా వచ్చిన నిశబ్దం సినిమా ఏమాత్రం సౌండ్ చేయకుండానే వెళ్లి పోయింది.ఆ సినిమాలో అనుష్క ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.
ముఖ్యంగా ఆమె లుక్ విషయంలో తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు.అభిమానులు సైతం పెదవి విరిచారు అంటూ వార్తలు వచ్చాయి.
సినిమాల్లో కొనసాగాలంటే తన లుక్ ను పూర్తిగా మార్చుకోవాలనే నిర్ణయానికి అనుష్క వచ్చినట్లుగా తెలుస్తుంది.అందుకే తాను మిర్చిలో ఎలా అయితే కనిపించిందో అలాంటి లుక్ కు మళ్లీ రావాలని అనుష్క నిర్ణయించుకున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
ప్రతి రోజూ ఐదు గంటల పాటు యోగా మరియు ఎక్సర్సైజ్ చేయడం ద్వారా బరువు తగ్గాలని నిర్ణయానికి వచ్చింది.మిర్చి సమయంలో ఎంత బరువు అయితే ఉన్నానో అంత బరువు కి వచ్చే వరకు కొత్త సినిమాకు కమిట్ అవ్వడం లేదంటూ ఇటీవల ఆమెను కలిసిన ఒక నిర్మాతకు చెప్పినట్లుగా తెలుస్తోంది.
అంటే వచ్చే ఏడాది డిసెంబర్ వరకు అనుష్క కొత్త సినిమాలకు కమిట్ అయ్యే అవకాశం లేదు.ఆలస్యం అయినా పర్వాలేదు కానీ అనుష్క మిర్చి లుక్ వస్తే కచ్చితంగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అనడంలో సందేహం లేదు.