బాహుబలి వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా చేసిన తర్వాత ఏ హీరో అయినా హీరోయిన్ అయినా వరుసగా సినిమాలు చేయడం వల్ల తమ మార్కెట్ ను మరింతగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు.ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్నది అదే.
కానీ ఈ విషయంలో అనుష్క మాత్రం విఫలం అయినట్లుగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బాహుబలి సినిమా తర్వాత భాగమతి సినిమా తో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఆ సినిమా యావరేజ్ సక్సస్ ను దక్కించుకున్నా భారీ వసూళ్లను రాబట్టింది.ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్ చూస్తే సినీ వర్గాల వారు సైతం ఆశ్చర్య పోయారు.
బాహుబలి క్రేజ్ వల్లే భాగమతికి ఆ స్థాయి వసూళ్లు వచ్చాయంటూ అందరూ బలంగా నమ్మారు.అందుకే ఆమె వరుసగా సినిమాలు చేస్తే ఖచ్చితంగా అన్ని సినిమాలు కూడా మంచి వసూళ్లు సాధించడం ఖాయం అంటూ అంతా భావించారు.
కానీ ఆమె మాత్రం వరుసగా సినిమాలు చేయడం లేదు కదా రెండు మూడేళ్లకు ఒకసారి సినిమాను తీసుకొస్తుంది.భాగమతి సినిమా విడుదలై దాదాపు మూడేళ్లు అయిన తర్వాత ఆమె నటించిన నిశ్శబ్దం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అది కూడా ఓటీటీ ద్వారా రావడంతో ఆమె ప్రేక్షకులకు రీచ్ కాలేకపోయింది అంటూ టాక్ వస్తోంది.నిశ్శబ్దం సినిమాకు వచ్చిన టాక్ తో అయినా అనుష్క ఇకపై జాగ్రత్త పడాలంటూ అభిమానులు ఆశిస్తున్నారు.
కమర్షియల్ సినిమాలకు ఆమె ఒప్పుకుంటే బాగుంటుందని ఇలాంటి ప్రయోగాలు చేయడం వల్ల ఆమె నటిగా పేరుతెచ్చుకుంది తప్పితే అభిమానులను మెప్పించే లేదంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇకపై అయినా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే సినిమాలు చేస్తూ ఇతర సినిమాల కూడా ఓకే చెప్పాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు.
ఆమె స్టార్ హీరోల సరసన నటించే అవకాశం లేదు అయినా కూడా ఆమె కమర్షియల్ ఎలిమెంట్స్ తో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.