బాహుబలి తర్వాత సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ అనుష్క రేంజ్ అమాంతం పెరిగిపోయింది.నటిగా ఒక్కోమెట్టు ఎక్కుతూ వెళ్లిన దేవసేనకి బాహుబలి సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది.
ఈ సినిమా తర్వాత అనుష్క సోలోగా బాగమతి సినిమాతో ఏకంగా 50 కోట్లు కలెక్షన్ చేసి తన స్టామినాని పరిచయం చేసుకుంది.నయనతారకి కేవలం తమిళంలో మాత్రమే సోలోగా మార్కెట్ ఉంది.
కానీ అనుష్కని తెలుగు, తమిళం బాషలలో మంచి మార్కెట్ ఉంది.ఆమెతో సినిమా చేస్తే కచ్చితంగా 40 నుంచి 50 కోట్లు కలెక్షన్ పక్కా అని నిర్మాతలు నమ్మకంతో ఉన్నారు.
ఈ నేపధ్యంలో అనుష్క నిశ్శబ్దం సినిమాతో త్వరలో అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కింది.
మాధవన్, అంజలి, హాలీవుడ్ యాక్టర్స్ ఉన్న ఈ సినిమాలో కథ మొత్తం అనుష్క పాత్ర చుట్టూనే తిరుగుతుంది.
సినిమాని కూడా అనుష్కని చూసే ఓటీటీ ఛానల్ వారు కొనుగోలు చేశారు.
ఇక ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ఇప్పుడు నిశ్శబ్దం సినిమా రిలీజ్ చేయడానికి ఓటీటీ తప్ప మరో అప్షన్ లేదని, పరిస్థితులకి తగ్గట్లు మార్పుని స్వీకరించాల్సిందే అని చెప్పుకొచ్చింది.
అలాగే వచ్చే ఏడాది మరల తన కొత్త సినిమాలు షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు క్లారిటీ ఇచ్చింది.ఇప్పటి వరకు మూడు సినిమాలు అంగీకరించానని చెప్పింది.ఇదిలా ఉంటే ఈమె నెక్స్ట్ చేయబోయే మూడు సినిమాలు కూడా లేడీ ఒరియాంటెడ్ కథలతోనే తెరకెక్కుతూ ఉండటం విశేషం.అందులో రెండు సినిమాలు తమిళంలో తెరకెక్కుతూ ఉండగా, వచ్చే ఏడాది తెలుగులో ఒకే సినిమా చేస్తుంది.
అయితే ప్రస్తుతం అనుష్క పాన్ ఇండియా రేంజ్ యాక్టర్ కాబట్టి ఆమె సినిమాలు అన్ని సౌత్ బాషలలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.మూడు సినిమాలు చేతిలో పెట్టుకొని ఉందంటే ఇప్పట్లో పెళ్లి ఆలోచన ఈ భామకి లేనట్లు ఉందని ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.