టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కన్నడ బ్యూటీ అనుష్క గురించి తెలియని వాళ్ళేవ్వరూ లేరు.తన అందంతో, నటనతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుష్క స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.
అంతేకాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది.ఒకప్పుడు ఏడాదికి ఎన్నో సినిమాలలో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంది.
ఇదిలా ఉంటే ఎమోషన్ మెసేజ్ షేర్ చేసింది ఈ బ్యూటీ.
ఈమధ్య అనుష్క కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది.
ఇక తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.ఇటీవల కాలంలో తన అభిమానులకు తన సోషల్ మీడియా ఖాతాల వివరాలు కూడా అందించింది.
ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.
అందులో అనుష్క కొన్ని ఎమోషనల్ విషయాలు పంచుకుంది.
అందరూ ప్రేమగా ఉండండి ఒకరినొకరు ప్రేమించండి.మీరు ఎదుటివారిని ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పండి.
మీలో ఉన్న ఫీలింగ్ బయట పెట్టండి అంటుంది ఈ బ్యూటీ.అంతేకాకుండా అవతలివారు అతిగా స్పందిస్తే బాధపడకండి అంటూ ధైర్యం ఇచ్చింది.
మీకు ఏది అనిపిస్తే అది చెప్పమని, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అంటూ ప్రపంచంలో ఇంకా మంచితనం మీలోనే ఉందని నిరూపించేలా చేయాలని తెలిపింది.
మీలో ఉన్న భావాలు చెప్పుకోడానికి భయపడకండి అంటూ ముందుకు వెళ్ళడానికి మరింత ప్రయత్నించాలి అంటూ సలహా ఇచ్చింది.గతంలో జరిగిన విషయాలను వదులుకొని కొత్తగా ఆరంభమయ్యే విషయాలను ఆహ్వానించమని తెలిపింది.మీ బాధను పోగొట్టే వాళ్లతో దగ్గరగా ఉండండి అంటూ బాధ పెట్టే వాటికి దూరంగా ఉండండి అంటూ మీలో శక్తి నిలుపుకొని పెదాలపై ఎప్పుడూ చిరునవ్వు ఉండేలా చూసుకోవాలి అంటూ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది.
అసలేం జరిగిందో కానీ ఈ పోస్టు షేర్ చేసిన వెంటనే అనుష్కకు ఏమైంది అంటూ తెగ కామెంట్స్ వస్తున్నాయి.
ఇటీవలే నిశ్శబ్దం సినిమాలో నటించగా ఈ సినిమా అంతగా సక్సెస్ అవ్వలేదు.ఇక మరిన్ని అవకాశాలు అందుకుంటుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.డైరెక్టర్ మహేష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు తెలిసింది.
ఇక మరో క్రేజీ డైరెక్టర్ అనుష్క కోసం ఓ వెబ్ సిరీస్ కథను వినిపించాడని తెలుస్తుంది.కానీ ఈ విషయం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.