అందం, అభినయం, టాలెంట్, అంకిత భావం కలగలిపితే అనుష్క.సినీ ఇండస్ట్రీలో అసలు కథానాయక అంటే గ్లామర్ పాత్రలో మెరిసే ఓ బొమ్మ అన్న అభిప్రాయం ఉండేది.
అదే సమయంలో కథానయకకు సరైన నిర్వచనం చెప్పింది ఈ సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్.హీరో ఎవరైనా.
ఎలాంటి పాత్రైనా నేను రెడీ అంటూ క్యారక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేసే ఈ ముద్దుగుమ్మ బీసీఏ చదవి ఫిట్ నెస్ రంగంలోకి అడుగుపెట్టింది.
ప్రముఖ యోగా గురు భరత్ ఠాకూర్ శిష్యురాలిగా వెండితెరకు పరిచయమైంది.2005లో డైరక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ సినిమాలో సాషాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది అందర్ని ఆకర్షించింది.అలా ప్రారంభమైన స్వీటీ ఫిల్మిం కెరియర్ అగ్రహీరోలతో పోటాపోటీగా యాక్ట్ చేసే స్థాయికి ఎదిగింది.
ప్రభాస్, చిరంజీవి, రవితేజ, వెంకటేష్, మహేష్ బాబు, గోపిచంద్ లతో పాటు అరుంధతి లాంటి వైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్ లో తనకు తానే సాటి అని నిరూపించుకుంది.అరుంధతిలో జేజెమ్మగా, వేదంలో సరోజగా, బాహుబలిలో దేవసేనగా ఇలా ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోయే అనుష్కకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.2009లో శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాతగా, కోడిరామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన అరుంధతి సినిమాలో జేజెమ్మ పాత్రతో దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.భారీ విజువల్ ఎఫెక్ట్, రూ.10కోట్ల బడ్జెట్ తో నిర్మించగా.జేజెమ్మ పాత్ర లో అనుష్క మెప్పించడంతో ఆ సినిమా రూ.60 కోట్ల వసూళ్లతో రికార్డ్ లను షేక్ చేసింది.
ఇక ఆ తరువాత వచ్చిన బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.
రీసెంట్ గా విడుదలైన లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్ మూవీ నిశబ్ధంలో సాక్షి క్యారక్టర్ లో మెస్మరైజ్ చేసింది.ఇంతటి ఘన కీర్తిని సొంతం చేసుకున్న బెంగళూరు బ్యూటీ గురించి కొన్ని ఆసక్తికర విషయాల్ని తన అభిమానులతో పంచుకుంది.
యోగా తన జీవితంలో ఒక భాగమైందని , తద్వారా సమాజంలో రకరకాల మనుషులున్నారు అందరి అభిప్రాయాల్నిగౌరవిస్తూ మన టాలెంట్ ను మనం నమ్ముకోవాలని తెలిపింది.
ఇక సినిమాల్లో డైరక్టర్, రచయితల కన్నా కంటెంట్ కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తానన్న ఈ ముద్దుగుమ్మ.
వ్యక్తిగత రహస్యాలుంటే తన స్నేహితులు, కుటుంబసభ్యులతో పంచుకుంటానని తెలిపింది.నిశబ్ధం తరువాత ఏం సినిమాలు చేస్తున్నారని అభిమానులు అడగ్గా.
రెండు మూడు ప్రాజెక్ట్ స్క్రిప్ట్ డిస్కషన్స్ నడుస్తున్నట్లు చెప్పింది స్వీటీ శెట్టీ.