టాలీవుడ్ స్వీటీ అనుష్క ప్రస్తుతం “నిశబ్దం” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
ఈ చిత్రంలో సీనియర్ నటుడు మాధవన్, తెలుగు భామ అంజలి, శాలిని పాండే, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.ఈ చిత్రం తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ విడుదల చేసేందుకు దర్శకుడు హేమంత్ మధుకర్ సన్నాహాలు చేస్తున్నాడు.
అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించడంతో సినిమా థియేటర్లు మూసివేశారు.అయితే జన సాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుందని పలువురు వైద్యనిపుణులు సూచించడంతో లాక్ డౌన్ కంటే ముందుగానే సినిమా థియేటర్లను మూసివేయాలని సినిమా థియేటర్ల యాజమాన్యం సంఘం నిర్ణయించారు.
దీంతో ఇప్పటికే ఈ నిశ్శబ్దం చిత్రం విడుదల కావాల్సి ఉండగా ఈ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.దీంతో దర్శక నిర్మాతలకు లాభాల మాట అటుంచితే నష్టాలు చవి చూసే అవకాశాలు కనబడుతున్నాయి.
దీనికి తోడు ఒకవేళ లాక్ డౌన్ ఎత్తివేసినా సినిమా థియేటర్లకు మరి కొంత కాలం పాటు లాక్ డౌన్ నిబంధనలు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీంతో చిత్ర యూనిట్ సభ్యులు ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కి అమ్మేయలని నిర్ణయించుకున్నారు.
కానీ అందుకు అనుష్క ఒప్పుకోవడం లేదట. దీంతో అనుష్క తీరుపై చిత్ర యూనిట్ సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారట.అంతేగాక ఒకవేళ ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేసినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావాలంటే కొంత మేర భయపడుతున్నారు.అదే జరిగితే ఈ చిత్రాన్నిథియేటర్లలో విడుదల చేసినా నిరుపయోగం అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారట.
అందువల్లే ఈ చిత్రాన్ని ఓటిటి ప్లాట్ ఫారం కి అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.