టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నిశ్శబ్దం సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకుంది.దీంతో ఆమె ఇక సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి పెళ్లి పీటలు ఎక్కుతుందని అందరూ భావించారు.
ఆమెకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని కూడా ప్రచారంలోకి వచ్చింది.అలాగే ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ టాక్ వినిపించింది.
అయితే ఇవేమీ వాస్తవం కాలేదు.ఇక ఫైనల్ గా ఆమె రారా క్రిష్నయ్య ఫేం మహేష్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ సినిమాని అఫీషియల్ గా కరోనా సెకండ్ వేవ్ సిచువేషన్ కి ముందే లాంచ్ చేశారు.ప్రస్తుతం దర్శకడు స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీప్రొడక్షన్ పనులలో ఉన్నాడు.
ఇక ఈ మూవీలో అనుష్కకి జోడీగా నవీన్ పోలిశెట్టిని కన్ఫర్మ్ చేశారు.దీంతో ఈ సినిమా కథాంశం ఎలా ఉండబోతుంది అనే విషయంలో చాలా మందికి స్పష్టత వచ్చింది.
ఇదిలా ఉంటే ఈ మూవీకి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ ని కూడా ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తుంది.సౌత్ బాషలలో ఈ మూవీని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు.ఈ నేపధ్యంలో క్యాస్టింగ్ సెలక్షన్ కూడా అన్ని బాషలకి చెందిన నటులు ఉండేలా చూసుకుంటున్నారు.ఇక ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేద్దామని అనుకునే సమయానికి కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ కారణంగా కుదరలేదు.
అయితే ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపులతో పాటు షూటింగ్ లకి పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం ఉండటంతో ఫస్ట్ షెడ్యూల్ కోసం దర్శకుడు మహేష్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.జులై ఆఖరులో లేదంటే ఆగష్టులో అనుష్క, పోలిశెట్టి కాంబినేషన్ షూట్ స్టార్ట్ చేయడాలని షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నట్లు బోగట్టా.