నిశ్శబ్ధం పరిస్థితి ఏమిటి.. అనుష్కను పట్టించుకునే వారు లేరా?

టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ నిశ్శబ్ధం ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.

 Nishabdham Movie Goes Silent, Nishabdham, Anushka Shetty, Madhavan, Tollywood Ne-TeluguStop.com

కానీ కరోనా వైరస్ కారణంగా నెలకొన్న లాక్‌డౌన్‌తో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.అయితే ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి ఏమాత్రం కనిపించకపోవడంతో ఈ సినిమా రిలీజ్ అయోమయంలో పడింది.

అయితే ఈ సినిమా రిలీజ్‌పై ఇటీవల చిత్ర నిర్మాత కోన వెంకట్ ఓ క్లారిటీ ఇచ్చారు.ఒకవేళ థియేటర్లు తెరుచుకుంటే సినిమాను రిలీజ్ చేస్తామని, లేకపోతే ఓటీటీలో చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు.

దీంతో ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు.కానీ నిశ్శబ్దం సినిమా సైలెంట్ అయిపోవడంతో, ఈ సినిమాను రిలీజ్ చేస్తారా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది.

ఒకవేళ ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తే అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించకపోవచ్చు అనే అనుమానం చిత్ర యూనిట్‌లో నెలకొందని తెలుస్తోంది.

అందుకే వారు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారట.

ఇక ఈ సినిమాలో అనుష్క మూగ, చెవిటి అమ్మాయిగా నటిస్తుండగా మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.అందాల భామ షాలిని పాండే, అంజలి కూడా ఈ సినిమాలో నటిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

మరి నిశ్శబ్దం చిత్ర రిలీజ్‌పై ఈ నిశ్శబ్దం ఎప్పుడు తొలిగిపోతుందో తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్ క్లారిటీ ఇచ్చే వరకు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube