టాలీవుడ్ లో లేడి ఓరియెంటెడ్ పాత్రలకు పెట్టింది పేరు అనుష్క శెట్టి.ఈ భామ తెలుగులోకి అక్కినేని నాగార్జున నటించినటువంటి సూపర్ అనే చిత్రంతో తెరంగేట్రం చేసి దాదాపుగా స్టార్ హీరోల తో పాటు ఇమేజ్ ని దక్కించుకుంది.
అంతేకాక టాలీవుడ్లోని భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించాలంటే ముందుగా ప్రస్తావించే పేరు అనుష్క శెట్టి.అలాంటిది ఈ భామ ఈ మధ్య కాలంలో తన సినిమాల జోరుని తగ్గించింది.
తాజాగా ఈ అమ్మడు టాలీవుడ్ సినీ పరిశ్రమకి తెరంగేట్రం చేసి నేటితో ఖచ్చితంగా 15 సంవత్సరాలు అవుతోంది.ఈ పదిహేను సంవత్సరాల కాలంలో అనుష్క శెట్టి పలురకాల లేడీ ఓరియెంటెడ్ పాత్రలలోనే కాకుండా గ్లామరస్ పాత్రలు, మంచి కుటుంబ తరహా పాత్రలు చేస్తూ సినీ పరిశ్రమతో సంబంధం లేకుండా తనకంటూ కొద్ది మంది అభిమానులని సంపాదించుకుంది ఈ అమ్మడు.
అనుష్క దాదాపుగా టాలీవుడ్లోనూ ఇద్దరు స్టార్ హీరోల సరసన నటించింది.అయితే నేటితో ఈ అమ్మడు సినీ పరిశ్రమకు పరిచయం అయి 15 సంవత్సరాలు కావస్తున్నా దాంతో పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అయితే అనుష్క ఇప్పటివరకూ తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో కలిపి హీరోయిన్ గా దాదాపుగా 45కి పైగా చిత్రాల్లో నటించింది.
అయితే ప్రస్తుతం అనుష్క శెట్టి నిశ్శబ్దం అనే చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడుహేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రంలో అనుష్క మూగ చెవిటి సంబంధిత వ్యాధి కలిగినటువంటి ఓ యువతి పాత్రలో నటిస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ విడుదల ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.అయితే ఈ చిత్రాన్ని ఏప్రిల్ రెండో తారీఖున విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.