సూపర్ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఏకంగా 15 ఏళ్ల కెరియర్ ని పూర్తి చేసుకున్న భామ అనుష్క శెట్టి.అరుందతి సినిమాతో స్టార్ హీరోయిన్ చైర్ లోకి వచ్చేసిన ఈ భామ సౌత్ ఇండస్ట్రీలో రూల్ చేస్తూ ఉంది.
ఓ వైపు కమర్షియల్ సినిమాలతో స్టార్ హీరోలకి జోడీగా నటిస్తూనే మరో వైపు లేడీ ఒరియాంటెడ్ కథలతో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది.ఆమె కెరియర్ అన్ని సినిమాలు ఒక ఎత్తైతే బాహుబలి సిరీస్ మరో ఎత్తు.
ఈ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా అనుష్క కీర్తి ఆకాశం అంత ఎత్తుకి పెరిగిపోయింది.సౌత్ లో ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ గా ఈ అమ్మడు తన హవా కొనసాగిస్తుంది.
బాహుబలి తర్వాత సోలోగా బాగమతి సినిమాతో ఎబ్భై కోట్ల కలెక్షన్ చేసి తన సత్తా ప్రూవ్ చేసుకున్న అనుష్క ప్రస్తుతం నిశ్శబ్దం సినిమాతో మరోసారి తన సత్తా నిరూపించుకోవడానికి రెడీ అవుతుంది.హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఏకంగా ఏడు బాషలలో ఈ సినిమా రిలీజ్ కావడానికి రెడీగా ఉంది.
కరోనా పరిస్థితుల కారణంగా ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా వాయిదా పడింది.ఇదిలా ఉంటే నిశ్శబ్దం తర్వాత అనుష్క సినిమాలు చేయదని టాక్ వినిపించిన ఆమె తెలుగు సినిమాలని కొద్దిగా పక్కన పెట్టి కోలీవుడ్ పై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది.
ప్రస్తుతం ఆమె గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక లేడీ ఒరియాంటెడ్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అలాగే ఏ.ఎల్ విజయ్ దర్శకత్వంలో ఒక లేడీ ఒరియాంటెడ్ కథకి ఒకే చెప్పింది.వీటితో పాటు విజయ్ సేతుపతికి జోడీగా ఒక సినిమాలో నటించడానికి అనుష్క పచ్చజెండా ఊపింది.
మొత్తానికి నిశ్శబ్దం తర్వాత ఆమె ఏకంగా మూడు సినిమాలు కోలీవుడ్ లోనే చేయడానికి నిర్ణయించుకుంది.అవి పూర్తయ్యే వరకు తెలుగు సినిమా చేసే అవకాశం లేదు.అయితే అనుష్కకి ఉన్న మార్కెట్ దృష్ట్యా ఈ తమిళ సినిమాలో తెలుగులో కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.అలా అనుష్క తెలుగు అభిమానులకి కొంత వరకు ఊరట కలిగిస్తుంది.
మరి కోలీవుడ్ పై ఆమె ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడానికి కారణం ఏమిటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.