ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు.సామజిక అంశాన్ని ఎంచుకుని కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాలో చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా నిలిచి పోయింది.
ఈ సినిమా దాదాపు 90 శాతం మేరకు షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ మధ్య వచ్చే సీన్స్ చాలా బాగుంటాయని.
ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని కొరటాల శివ తెలిపారు.ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా కాజల్, రామ్ చరణ్ కు జోడిగా పూజ హెగ్డే నటిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా చిరంజీవి ఆచార్య సినిమా పూర్తి చేసిన తర్వాత రెండు రీమేక్ సినిమాలను లైన్లో పెట్టాడు.లూసిఫర్, వేదాళం అనే రెండు రీమేక్ సినిమాల్లో చిరంజీవి నటించబోతున్నాడు.
ముందుగా లూసిఫర్ సినిమా మొదలు పెట్టబోతున్నాడు.ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.మోహన్ రాజా తెలుగు వాడైనా తమిళంలో వరస సినిమాలు చేసి హిట్స్ అందుకున్నాడు.ఇప్పటికే డైరెక్టర్ మోహన్ రాజా లూసిఫర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి రెడీగా ఉన్నాడు.
కరోనా కారణంగా ఇంకా ఈ సినిమా మొదలవ్వలేదు.పరిస్థితులు చక్కబడిన తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని సమాచారం.
లూసిఫర్ సినిమాను ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతారను తీసుకోవాలని అనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు ఈ పాత్ర కోసం అనుష్క పేరు వినిపిస్తుంది.ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా తక్కువుగా ఉంటుందని జస్ట్ గెస్ట్ క్యారెక్టర్ లాగా ఉంటుందని అందుకే ఈ పాత్ర కోసం అనుష్క అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ అభిప్రాయ పడుతున్నారట.
చూడాలి మరి ఈ వార్తలో నిజమెంతో.