భారతదేశంలో బాగా పేరు పొందిన సెలబ్రిటీస్ జంటగా విరాట్ కోహ్లీ హీరోయిన్ అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.భర్త టీమిండియాకు కెప్టెన్ గా బాధ్యతలు వహిస్తుంటే.
మరోపక్క అనుష్క శర్మ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ స్టార్ డమ్ ను నిలబెట్టుకున్నారు.ప్రస్తుతం యూఏఈ దేశంలో ఐపీఎల్ సీజన్ లో భాగంగా విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో పరుగులతో రెచ్చిపోతున్నాడు.
గ్రౌండ్ లో పరుగులతో రెచ్చిపోతున్న కోహ్లీ మరోవైపు తన భార్యతో రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.దుబాయ్ నగరంలో తన భార్య తో కలిసి చెట్టాపట్టాలేసుకొని తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇకపోతే తాజాగా అనుష్క, కోహ్లీ లు సముద్రంలో దగ్గరగా ఒకరినొకరు చూసుకుంటూ ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వారిద్దరు సాయంత్రం వేల ఇలా ఘాటుగా ఒకరినొకరు చూసుకుంటూ రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు.
ఈ సందర్భంలో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఆటగాడైన ఎబి డివిలియర్స్ వారిద్దరు ఎంజాయ్ చేస్తున్న మధుర క్షణాలను ఓ ఫోటోతో క్లిక్ మనిపించాడు.ఆ ఫోటోని తాజాగా విరాట్ కోహ్లీ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
ఈ ఫోటో కు క్రెడిట్ ఎబి డివిలియర్స్ అంటూ అతనిని ట్యాగ్ చేసాడు విరాట్ కోహ్లీ.
ఇకపోతే ఆ ఫోటోలో వెనకాల ఓ పెద్ద కోట కనిపిస్తుంది.అనుష్క విరాట్ కోహ్లీ స్విమ్మింగ్ చేస్తూ ఒకరినొకరు చూసుకుంటున్న ఈ ఫోటోకి నెటిజెన్స్ నుండి విశేష స్పందన వస్తోంది.ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఐపీఎల్ సీజన్ కారణంగా దుబాయ్ లో ఉంటున్నాడు.
తన భార్య అనుష్క శర్మ కూడా ఆయనతోనే దుబాయిలో ఉంది.మ్యాచ్ లేని సమయంలో విరాట్ కోహ్లీ ఇలా తన భార్యతో కలిసి దుబాయ్ ని చుట్టేస్తున్నాడు.ప్రస్తుతం అనుష్క శర్మ గర్భవతి.2021 జనవరి మాసంలో వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు.