ప్రస్తుత కాలంలో ఎవరో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చేసుటువంటి పనుల కారణంగా కొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియా మాధ్యమాలలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.తాజాగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి ట్విట్టర్లో విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మ విడాకులు తీసుకుంటున్నట్లు తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారు.
దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మధ్యలో తెగ వైరల్ అవుతోంది.కాగా కొంతమంది విరాట్ కోహ్లీ అభిమానులు మాత్రం ఇలాంటి వ్యాఖ్యలపై దీటుగా స్పందిస్తూ ప్రస్తుతం విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మ సంతోషంగా జీవితం గడుపుతున్నారని కాబట్టి అలాంటి వారిపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం తగదని ఘాటుగా రిప్లై ఇస్తున్నారు.
కొంతమంది నెటిజన్లయితే ప్రస్తుత జనరేషన్లో సెలబ్రిటీలు మరియు పేరు, ప్రఖ్యాతలు కలిగినటువంటి వారిపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ పాపులర్ కావాలని ఆలోచిస్తున్నారని, ఇలాంటి వాటి వల్ల భవిష్యత్తులో ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఎటువంటి షూటింగ్లు లేకపోవడంతో అనుష్క శర్మ ఇంటి వద్దనే ఉంటూ ఇంటి పనులను చక్కబెడుతోంది.
అకాగే ఓ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రానికి సహ వ్యవహ రించేందుకు సంప్రదింపులు జరుపుతోంది.కాగా విరాట్ కోహ్లీ కూడా తన కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్నాడు.