దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువ బజ్ ఉన్న సినిమా ఏదంటే ఆది పురుష్ అని చెప్పాలి.డార్లింగ్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీగానే హైప్ ఉంది.
సినిమా సినిమాకి తన ఇమేజ్ ని పెంచుకుంటున్న ప్రభాస్ ఈ సినిమా కోసం కథానాయకుడు శ్రీరాముడు పాత్రలో కనిపించబోతున్నాడు.ఇప్పటి వరకు మనం చూసిన రాముడు తరహాలో కాకుండా ఇందులో ప్రభాస్ ని సరికొత్తగా దర్శకుడు ఓం రౌత్ ఆవిష్కరించబోతున్నాడు.
ఈ సినిమా మెజారిటీ షూటింగ్ గ్రీన్ మ్యాట్ లోనే జరగనుంది.విజువల్ వండర్ గా సినిమాని ఆవిష్కరించేందుకు దర్శకుడు సిద్ధం అవుతున్నాడు.
ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ కోసం హాలీవుడ్ టీం ని రంగంలోకి దించుతున్నాడు.హాలీవుడ్ అడ్వంచర్ సినిమాల తరహాలో పూర్తి స్థాయి గ్రీన్ మ్యాట్ మూవీగా ఆది పురుష్ ఉండబోతుందని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాని త్రీడీ టెక్నాలజీలో ఆవిష్కరించబోతున్నారు.
థియేటర్ లో సినిమా చూసే ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని అందించే ప్రయత్నం దర్శకుడు ఓం రౌత్ చేయబోతున్నాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో రావణుడుగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.ఇక సీత పాత్రలో ఎవరు నటిస్తారు అనేదాని మీద ఆసక్తి నెలకొని ఉంది.చాలా మంది పేర్లు సీత పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది.అందులో కీర్తి సురేష్, కైరా అద్వానీ, ఊర్వశీ రౌటేలా పేర్లు వినిపించాయి.
వీరిలో ఎవరిని సీత పాత్ర కోసం సంప్రదించలేదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది.అయితే ఇప్పుడు సరికొత్తగా అనుష్క శర్మ పేరు తెరపైకి వచ్చింది.
సీత పాత్ర కోసం ఆమెని సంప్రదించినట్లు ప్రచారం జరుగుతుంది.ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ తో ఉంది.
ఈ సమయంలో సీత పాత్రలో నటించడం సాధ్యం కాదు కదా అని డౌట్ కూడా వచ్చింది.అయితే ఆది పురుష్ షూటింగ్ జనవరి తరువాత స్టార్ట్ అవుతుంది.
అప్పటికి అనుష్క డెలివరీ అయిపోతుంది.ఆమె కండిషన్ చూసుకొని ఆమె నటించబోయే సన్నివేశాలని కాస్తా ఆలస్యంగా ప్లాన్ చేస్తారని ప్రచారం జరుగుతుంది.
మరి ఇందులో వాస్తవం ఎంత అనేది చిత్ర యూనిట్ ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.