విరాట్ కోహ్లీపై ఎమోషనల్ పోస్టు పెట్టిన అనుష్క శర్మ..!!

T20 వరల్డ్ కప్ టోర్నీలో ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ గెలవడం తెలిసిందే.ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శన ప్రదర్శించి టీంనీ విజయ తీరాల చేర్చడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది.

 Anushka Sharma Posted An Emotional Post On Virat Kohli Details, T20wc 2022, Indi-TeluguStop.com

ముఖ్యంగా చివరి రెండు ఓవర్లలో విరాట్ కోహ్లీ ఆడిన ఆట తీరు ప్రత్యర్థి పాక్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టేసింది.

ఏకంగా 82 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు.

దీంతో విరాట్ కోహ్లీ పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఈ క్రమంలో భార్య హీరోయిన్ అనుష్క శర్మ.

సోషల్ మీడియాలో విరాట్ ఆట తీరుపై ఎమోషనల్ పోస్టు పెట్టింది.దీపావళి సందర్భంగా ప్రజల జీవితాల్లో ఈ రోజు రాత్రి ఆనందాన్ని తెచ్చాడని పేర్కొంది.“మీ ఆట చూస్తే గర్వంగా ఉంది.నా జీవితంలో అత్యుత్తమ మ్యాచ్ ను ఇప్పుడే చూశా.

మునుపెన్నడు లేనంతగా చాలా బలంగా తెలివిగా ఆడావు.నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తున్నా” అని పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube