బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటి అనుష్క శర్మ.ఈ భామ బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించిన ఈ భామ తరువాత టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తో డేటింగ్ చేసి తరువాత పెళ్లి చేసుకొని ఏకమయ్యారు.
ప్రస్తుతం సెలబ్రిటీ సర్కిల్ లో విరుష్కగా భాగా పాపులర్ అయ్యారు.ఇక ఈ మధ్య కాలంలో అనుష్క నటిగా చేస్తూనే ప్రొడక్షన్ హౌస్ పెట్టి నిర్మాతగా మారి సినిమాలు తీస్తుంది.
ఇప్పటికే బాలీవుడ్ లో సినిమాలు నిర్మిస్తూ సక్సెస్ ట్రాక్ కలిగి ఉంది.ఇక ఈ భామ త్వరలో సౌత్ సినిమాల మీద కూడా దృష్టిపెట్టినట్లు టాక్ వినిపిస్తుంది.
ముఖ్యంగా తెలుగు సినిమాల మీద ఈ అమ్మడు ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
ఇందులో భాగంగా ముందుగా వేరొక ప్రొడక్షన్ తో కలిసి తక్కువ బడ్జెట్ తో థ్రిల్లర్ కథలతో సినిమాలు తీయాలని స్కెచ్ వేసినట్లు సమాచారం.
తరువాత సొంతగా సినిమాలు చేద్దామనే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.ఈ మధ్యకాలంలో బాలీవుడ్ సినిమాలతో సమానంగా తెలుగు సినిమాలకి కూడా మార్కెట్ రావడంతో అనుష్క ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.
తన పొడక్షన్ హౌస్ బ్రాండ్ వాల్యూకి తగ్గట్లుగానే థిల్లర్స్ ట్రై చేద్దామని అనుష్క ఆలోచన అని టాక్ వినిపిస్తోంది.అనుష్క శర్మ టాలీవుడ్ లో గతంలో ఓ సినిమాలో చేయాల్సి ఉంది.
గోపీచంద్ హీరోగా నటించిన ‘శౌర్యం’ సినిమాలో అతనికి చెల్లెలిగా చేసిన పూనమ్ కౌర్ రోల్ అనుష్క శర్మని ఎంపిక చేశారు.అదే సమయంలో కింగ్ ఖాన్ షారుక్ పక్కన ఛాన్స్ రావడంతో ఈ సినిమా వదులుకుంది.
నిజంగా అప్పుడు అనుష్క ఆ సినిమా చేయకపోవడం వలన ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగడంతో పాటు తెలుగులో సినిమాలు నిర్మించే స్థాయికి వచ్చింది.