కరోనా కారణంగా ఎప్పుడు బిజీగా ఉండే స్టార్స్ అంతా కూడా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు.ఏడాదిలో 8 నుండి 10 నుండి నెలలు క్రికెట్ ఆడుతూనే ఉండే టీం ఇండియా క్రికెటర్లు గత నాలుగు నెలలుగా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు.
ఈ పరిణామం టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అయిన అనుష్క శర్మకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందట.తాజాగా ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అనుష్క చెప్పిన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ మ్యాగ్జైన్ వోగ్ కవర్ పేజీ ఎక్కిన అనుష్క శర్మ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఆ ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం గురించిన విశేషాలను వెళ్లడి చేసింది.తన పెళ్లి అయిన కొత్తలో దాదాపు ఆరు నెలల పాటు ఇద్దరం కూడా విడిగానే ఉన్నాం.
ఆ సమయంలో మేము కేవలం 21 రోజులు మాత్రమే కలిసి ఉన్నామంటూ చెప్పుకొచ్చింది.విదేశాల్లో ఎక్కువగా క్రికెట్ ఆడటం వల్ల కోహ్లీని కలిసే అవకాశం తక్కువగా ఉండేది అంటూ చెప్పుకొచ్చింది.
పెళ్లి తర్వాత ఎవరైనా కనీసం ఆరు నెలలు పూర్తిగా కలిసి ఉండాలని ఎంజాయ్ చేయాలనుకుంటారు.కాని మేము మాత్రం 21 రోజులు మాత్రమే కలిసి ఉన్నామంటూ చెప్పుకొచ్చింది.
ఆ ఆరు నెలలు అత్యంత బాధకరంగా సాగాయంటూ విరహ వేదన అనుభవించిన సంఘటనను అనుష్క చెప్పుకొచ్చింది.