భారత క్రికెట్ జట్టు సారథిగా విరాట్ కోహ్లీ ఎంతో అద్భుతమైన సేవలను అందించారు.కెప్టెన్ గా ఉంటూ ఎన్నో విషయాలను అందుకొన్న విరాట్ కోహ్లీ ఉన్నఫలంగా వినూత్నమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఈ క్రమంలోని విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలను వదులుకున్నట్లు తీసుకున్న నిర్ణయం మనకు తెలిసిందే.అయితే కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయంపై అనుష్క శర్మ స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా అనుష్క శర్మ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ…
2014 వ సంవత్సరంలో టెస్ట్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఎంపికయ్యారు.ఈ క్రమంలోనే ధోని కెప్టెన్ గా రిటైర్ అవుతున్నారని తనని కెప్టెన్ గా నియమించారని నువ్వు చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి.
ఇలా చెప్పిన తర్వాత నువ్వు నేను ధోని చాట్ చేసుకోవడం నాకు ఇంకా గుర్తుంది.ఆ సమయంలో ధోని నీ గడ్డం తొందరగా నేరసిపోతుందని చెప్పడం ఎంతో సరదాగా అనిపించింది.
అలా గడ్డం నేరవడమే కాకుండా ఎంతో వృద్ధి చెందావు.
టీమ్ ఇండియన్ కెప్టెన్ గా ఉండి ఎన్నో విజయాలను అందించావు.నువ్వు చేసిన ఈ ఏడేళ్ల ప్రయాణంలో నిన్ను చూసి కూతురు ఎంతో నేర్చుకుంటుంది అంటూ విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం పై అనుష్క శర్మ ఎమోషనల్ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అనుష్క చేసిన ఈ పోస్ట్ పై ఎంతోమంది నెటిజెన్స్, లైక్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.