బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఇండియన్ క్రికెటర్ భార్య అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అనుష్క కోహ్లీ వివాహం తర్వాత పలు చిత్రాలలో నటించిన అనుష్క శర్మ తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పూర్తిగా నటనకు దూరం అయి తన కూతురు బాధ్యతలను చూసుకుంటున్నారు.
అయితే నటనకు దూరంగా ఉన్నప్పటికీ అనుష్క శర్మ మాత్రం డిజిటల్ మీడియాలో తన హవా కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలోనే 2013లో కర్నేష్ శర్మతో కలిసి అనుష్క శర్మ క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్ సంస్థను ప్రారంభించింది.
ఈ క్రమంలోనే తన సంస్థ ద్వారా అనుష్క శర్మ ‘ఎన్.హెచ్.10, ఫిల్లౌరి, పరి’ వంటి భిన్నమైన కథాంశాలతో సినిమాలతో మంచి గుర్తింపు పొందారు.ఇది ఇలా ఉండగా తాజాగా డిజిటల్ ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్, నెట్ ఫ్లిక్స్ తో ఈ ముద్దుగుమ్మ భారీ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే రాబోయే 18 నెలల్లో ఈ రెండు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి ఏకంగా 8 ప్రాజెక్టులను ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టుల కోసం ఈమె ఏకంగా 405 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.ఇప్పటికే ప్రముఖ లేడీ క్రికెటర్ ఝులన్ గోస్వామి మీద అనుష్క శర్మ ‘చక్దా ఎక్స్ ప్రెస్’ పేరుతో ఓ ఓటీటీ సినిమా తీసి నెట్ ఫ్లిక్స్ కు అందించినట్లు తెలిపారు.ఇదే కాకుండా మరో రెండు ప్రాజెక్టులు కూడా నెట్ ఫ్లిక్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
దీన్ని బట్టి చూస్తుంటే అనుష్క శర్మ డిజిటల్ మీడియా ద్వారా తన టాలెంట్ మరోసారి నిరూపించబోతుందని తెలుస్తోంది.