దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది.కోవిడ్ సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.
దీంతో పరిస్థితి మొత్తం గంభీరంగా తయారయింది.ప్రజలు కూడా సోషల్ మీడియా ప్రభావం వలన, మీడియా ప్రభావం వలన మానసికంగా నెగెటివిటీలోకి వెళ్లిపోయారు.
అయితే ఇప్పుడు అందరూ కోరుకునేది మానసిక ధైర్యం కల్పించవలసిన వారి కోసం వేచి చూస్తున్నారు.ఈ తరుణంలో సెలెబ్రెటీలు సైతం వారు కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకుంటూనే తమ ఫ్యాన్స్ లో, ప్రజలలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు.
సోనూ సూద్ లాంటి వారు ఏకంగా బాధితుల సమస్యల పరిష్కారానికి నడుం బిగిస్తున్నారు.
అందరూ అలా చేయడానికి ముందుకు రారు కనుక తమ వంతుగా ప్రజలకు ధైర్యాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ఈ జాబితాలో అనుష్క శెట్టి చేరింది.తనదైన శైలిలో ప్రజలకు ధైర్యం చెబుతోంది.అత్యవసరమైనప్పుడుమాత్రమే బయటికి రావాలని, రోజూ ఎటు వెళ్లి వచ్చినా తప్పకుండా శానిటైజ్ చేసుకోవాలని, తప్పనిసరి పరిస్థితులలో బయటికి వెళ్తే భౌతిక దూరం పాటిస్తూ మీ పనులను పూర్తి చేసుకోవాలని, త్వరలో మంచి రోజులు వస్తాయని, మంచి రోజులు వస్తాయని ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తోంది అనుష్క.ప్రజల్లో తన వంతుగా మానసిక ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్న అనుష్కను నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.