స్టార్ హీరోయిన్ అనుష్క ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్ గా మారిపోయింది.బాహుబలి తర్వాత ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
ప్రస్తుతం రిలీజ్ కి రెడీగా ఉన్న నిశ్శబ్దం సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లోకి తెరకెక్కింది.ఈ సినిమా హాలీవుడ్ లో కూడా రిలీజ్ కాబోతుంది.
అయితే ఈ మధ్య కాలంలో చాలా లిమిటెడ్ గా ఈ అమ్మడు సినిమాలు చేస్తుంది.ఎక్కువగా లేడీ ఒరియాంటెడ్ కథలకి మాత్రమే ఒకే చెబుతుంది.
అయితే పాత్ర ప్రాధాన్యత బట్టి కథానాయికగా కూడా చేయడానికి సిద్ధంగా ఉంది.అయితే ఆమె వయస్సు రీత్యా స్టార్ హీరోలకి, సీనియర్ హీరోలకి తప్ప కుర్ర హీరోలకి సెట్ కాదు.
అయితే స్టార్ హీరోలు అనుష్క డేట్స్ కోసం ఎవరూ ప్రయత్నం చేయడం లేదు.
ఆమె ఆహార్యం, లుక్ కూడా పూర్తిగా మారిపోవడంతో ఇక హీరోయిన్ గా ఆమె కెరియర్ ముగిసిపోయినట్లే అని అందరూ భావిస్తున్నారు.
ఇలాంటి సమయంలో ఈ అమ్మడు హీరోయిన్ గా ఓ తమిళ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఆమె కథానాయికగా నటించనుందని అంటున్నారు.ఇందులో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు.గతంలో ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో అనుష్క రెండు సినిమాలు చేసింది.ఆ పరిచయంతోనే ఈ చిత్రానికి ఆమె ఓకే చెప్పిందని తెలుస్తుంది.విజయ్ సేతుపతికి జోడీగా అనుష్క అంటే టాక్ ఇప్పుడు కోలీవుడ్ లో వైరల్ గా మారింది.
అనుష్క క్రేజ్ నేపధ్యంలో ఈ సినిమాకి మరింత హైప్ రావడం గ్యారెంటీ అనే మాట బలంగా వినిపిస్తుంది.ఇక తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.