గోపీచంద్ తో మూడో సారి కలిసి నటించబోతున్న దేవసేన

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటి అనుష్క శెట్టి.బాహుబలి సినిమాతో ఆమె రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.ఆ సినిమాతో నేషనల్ లెవల్ హీరోయిన్ అయిపొయింది.అలాగే సోలో హీరోయిన్ గా తన బ్రాండ్ చూపిస్తుంది.తాజాగా అనుష్క నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఈ సినిమా అనుకున్న స్థాయిలో మెప్పించాలేకపోయిన అనుష్క మాత్రం తన పాత్రకి జీవం పోసింది.

 Anushka Romance With Gopichand, Tollywood, Telugu Cinema, South Cinema, Director-TeluguStop.com

ఆమె పెర్ఫార్మెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె చేతిలో ఏకంగా మూడు సినిమాల వరకు ఉన్నాయి.

అవన్నీ లేడీ ఒరియాంటెడ్ కథలే కావడం విశేషం.ఇదిలా ఉంటే ఇప్పుడు అనుష్క మరో సినిమాలో అవకాశం సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.

టాలీవుడ్ లో గోపీచంద్, అనుష్క కాంబినేషన్ అంటే మంచి గుర్తింపు ఉంది.వారిద్దరి కలయికలో వచ్చిన లక్ష్యం, శౌర్యం’ చిత్రాలు కమర్షియల్‌ విజయాల్ని సాధించాయి.

మూడోసారి వీరిద్దరు కలిసి నటించబోతున్నట్లు తెలుస్తుంది. గోపీచంద్ హీరోగా‌ తేజ దర్శకత్వంలో అలిమేలుమంగ వెంకటరమణ పేరుతో ఓ చిత్రం తెరకెక్కబోతుంది.ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంది.ఈ నేపధ్యంలో తేజ కీర్తి సురేష్, సాయి పల్లవి కోసం ముందుగా ప్రయత్నం చేశాడు.

అయితే ప్రస్తుతం వారు వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్స్ కేటాయించలేకపోయారు.ఈ నేపధ్యంలో గోపీచంద్ కి పెర్ఫెక్ట్ ఛాయస్ అని అనుష్కని తేజ సంప్రదించినట్లు తెలుస్తుంది.

కథానాయికగా ఆమెను తీసుకున్నట్లు చెబుతున్నారు.త్వరలో అనుష్క ఎంపికపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

ఒక వేళ వీరిద్దరి కలయికలో సినిమా వస్తే అది ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube