టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించినటువంటి “సూపర్” అనే చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టి దాదాపుగా తెలుగులో అందరి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.అయితే ఈ అమ్మడు తెలుగులోనే కాక తమిళం, కన్నడ, తదితర భాషల్లో కూడా చాలా మంది అభిమానులను సంపాదించుకుంది.
సినిమా పరిశ్రమలో తన నటన పరంగానే కాకుండా, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి హీరోయిన్ గా కూడా పేరు తెచ్చుకుంది.అయితే తాజాగా ఈ అమ్మడు నిశ్శబ్దం అనే చిత్రంలో నటిస్తోంది.
ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ లో పాల్గొంది.
అయితే ఇందులో సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనే విషయంపై స్పందించింది.
తాను ముక్కుసూటి మనస్తత్వం కలిగినటువంటి దానినని, ఒకవేళ తనను ఎవరైనా దర్శకనిర్మాతలు కమిట్మెంట్ కావాలని అడిగినప్పుడు నిర్మొహమాటంగా నో చెబుతానని అందువల్ల తననుంచి కమిట్ మెంట్లు ఆశించే వారు తన వద్దకు రావాలంటే కొంత సంకోచిస్తారని చెప్పుకొచ్చింది.అంతేగాక ఈ విషయంలో తాను కూడా అంతే కట్టుదిట్టంగా ఉంటానని అందువల్ల అలాంటి వాటికి దూరంగా ఉంటానని తెలిపింది.
అంతేకాక ప్రతి ఒక్కరికి సినిమా పరిశ్రమలో రెండు దారులు ఉంటాయని ఇందులో కొందరు కష్టాలను ఎదుర్కొని అవకాశాలు సంపాదించుకుంటే మరొకరు మరికొందరు మాత్రం సులభ దారుల్లో అవకాశాలు సంపాదిస్తున్నారని, ఇందులో నేను కష్టమైన దారిలోనే ఎంచుకున్నానని చెప్పుకొచ్చింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా అనుష్క శెట్టి ప్రస్తుతం నటిస్తున్న “నిశ్శబ్దం” అనే చిత్రంలో మూగ చెవిటి సంబంధిత సమస్యతో బాధ పడుతున్నటువంటి యువతి పాత్రలో నటించనుంది.అయితే ఈ చిత్రంలో ప్రముఖ నటుడు మాధవన్, శాలిని పాండే, అంజలి, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని ఏప్రిల్ రెండో తారీఖున విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నప్పటికీ కరోనా వైరస్ వల్ల కొంతమేర వాయిదా పడేట్లు కనిపిస్తోంది.