మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ తర్వాత మోహన్ కృష్ణ దర్శకత్వంలో మలయాళీ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు.ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.
చిరంజీవి మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని కథలో కొన్ని మార్పులు చేసి దర్శకుడు మోహన్ కృష్ణ స్క్రిప్ట్ సిద్ధం చేసాడని బోగట్టా.ఇక ఈ మూవీలో చిరంజీవికి హీరోయిన్ అయితే లేదని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది.
అలాగే ఒరిజినల్ స్క్రిప్ట్ లో మోహన్ లాల్ చేసిన గాడ్ ఫాదర్ తరహా పాత్రలో పెద్దగా మార్పులు చేయలేదని బోగట్టా.ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలు పాత్ర చాలా కీలకంగా ఉంటుంది.
మలయాళంలో ఓ హీరోయిన్ ఈ పాత్రలో కనిపించింది.
ఈ నేపధ్యంలో ఆ పాత్ర కోసం తెలుగులో కూడా పేరున్న హీరోయిన్ ని తీసుకోవాలని భావించారు.
కీర్తి సురేష్ పేరు ప్రముఖంగా వినిపించింది.అయితే ఆమె చేయడానికి సుముఖంగా లేకపోవడంతో నిత్యా మీనన్ పేరు కూడా తెరపైకి వచ్చింది.
అయితే ఇప్పుడు దేవసేన స్వీటీ అనుష్క పేరు వినిపిస్తుంది.చిత్ర దర్శకుడు రీసెంట్ గా అనుష్కని సంప్రదించి కథని నేరేట్ చేయడం కూడా జరిగిందనే టాక్ నడుస్తుంది.
ఇక అనుష్క కూడా చేయడానికి సుముఖంగానే ఉందని బోగట్టా.ఒక వేళ నిజంగా అనుష్క ఈ మూవీలో చేయడానికి ఒకే చెబితే మాత్రం లూసీఫర్ రీమేక్ కచ్చితంగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది.
మెగాస్టార్, అనుష్క ఇమేజ్ తో సినిమా బిజినెస్ పరంగా కూడా మరింత హైప్ క్రియేట్ చేసే అవకాశం ఉందని ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.