సినిమాను తెరకెక్కించడం ఒక వంతు అయితే, ఆ సినిమాకు ప్రేక్షకులను తీసుకు రావడం మరో వంతు.తెరకెక్కించడానికి పడ్డ కష్టం కంటే కూడా ప్రేక్షకుల దృష్టి సినిమాపై పడేందుకు పడే కష్టం ఎక్కువగా ఉంటుంది.
కొత్త కొత్త పద్దతుల్లో పబ్లిసిటీ చేస్తే తప్ప ప్రేక్షకులు సినిమా వైపు చూడటం లేదు.అందుకే ఒక్కో సినిమాకు ఒక్కో తరహాలో పబ్లిసిటీ చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
తాజాగా అదే దారిలో అనుష్క సినిమాకు కూడా పబ్లిసిటీని కొత్తగా నిర్వహించాలని కేజీ బంగారం కాంటెస్ట్ను పెట్టారు.
అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘సైజ్ జీరో’ చిత్రం ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ప్రసాద్ వి పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు.ఈ సినిమా విడుదల సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు ఒక విచిత్రమైన కాంటెస్ట్ను పెట్టి సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఒక కూపన్ అందజేస్తారు.ఆ కూపన్లో ఉన్న కోడ్ను ఒక నెంబర్కు మెసేజ్ చేయాల్సి ఉంటుంది.
అందులోంచి ఒక్కరిని ఎంపిక చేసి కేజీ బంగారాన్ని బహుమతికి ఇవ్వనున్నారట.ఇలాంటి బటల షాపు ఆఫర్లు పెట్టి సినిమాకు ప్రేక్షకులను రాబట్టే పిచ్చి ప్రయత్నం ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.