అనుష్క కీలక పాత్రలో నటించిన నిశబ్దం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది.అన్ని సవ్యంగా జరిగి ఉంటే గత ఏడాది చివర్లోనే సినిమా వచ్చేది.
కాని షూటింగ్లో జాప్యం వల్ల మరియు కొన్ని సీన్స్ రీ షూట్ వల్ల సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది.సమ్మర్లో విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసిన సమయంలో కరోనా వచ్చింది.
దాంతో గత అయిదు నెలలుగా సెన్సార్ కూడా పూర్తి చేసుకుని విడుదల కోసం వెయిట్ చేస్తూ ఉంది.
నిశబ్దం చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విభిన్నమైన కాన్సెప్ట్తో సినిమాను తెరకెక్కించారు.అనుష్క ఈ చిత్రంలో మూగ అమ్మాయిగా కనిపించబోతుంది.
థ్రిల్లర్ ఎలిమెంట్స్తో ఆకట్టుకునే కథాంశంతో రూపొందించిన నిశబ్దం సినిమా కోసం అనుష్క ఫ్యాన్స్తో పాటు అన్ని వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే థియేటర్లు మూత బడి ఉండటంతో సినిమాను విడుదల చేయలేక పోతున్నారు.
ఓటీటీలో విడుదల చేయాలని నిశబ్దం మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని చిత్ర యూనిట్ సభ్యులు కొందరు సినిమా ఓటీటీ విడుదలను వ్యతిరేకిస్తున్నారు.ఆ కారణంగా సినిమా విడుదల విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేక పోతున్నారు.తాజాగా చిత్ర నిర్మాతల్లో ఒక్కరైన కోన వెంకట్ సోషల్ మీడియాలో నిశబ్దం ఓటీటీలో చూడాలనుకుంటున్నారా వెండి తెరపై చూడాలనుకుంటున్నారా అంటూ పోల్ పెట్టిన సమయంలో సగం కంటే ఎక్కువ మంది ఓటీటీలో చూడాలనుకుంటున్నట్లుగా చెప్పారు.
మరి ఆ తీర్పుతో అయినా నిశబ్దంను ఓటీటీలో విడుదల చేస్తారేమో చూడాలి.