టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి ఇండస్ట్రీలో దాదాపు పదేళ్లకు పైగా టాప్ హీరోయిన్గా కొనసాగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.ఈ బ్యూటీ స్టార్ హీరోలందరితోనూ నటించి ఈ స్థాయికి చేరుకుంది.
కాగా అరుంధతి చిత్రం దగ్గర్నుండీ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్గా మారిపోయింది ఈ బ్యూటీ.అయితే వరుసగా సినిమాలు చేస్తున్నా, అవి కనీసం ఏడాది గ్యాప్తో రిలీజ్ అవుతూ వస్తున్నాయి.
కాగా ఇటీవల అనుష్క సినిమాలపై ఆసక్తిని తగ్గించిందనే వాదన ఇండస్ట్రీ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తోంది.బాహుబలి చిత్రం దగ్గర్నుండే అనుష్కలో మార్పు కనిపిస్తుందని, ఆ తరువాత ఆమె చాలా తక్కువ సినిమాలు చేసిందని విమర్శకులు అంటున్నారు.
అటు అనుష్క ఇంట్లో ఆమెకు పెళ్లి విషయంపై ఒత్తిడి ఉండటం కూడా దీనికి కారణంగా వారు చెపుతున్నారు.అయితే ఇన్ని అడ్డంకుల మధ్య సినిమాలపై ఫోకస్ పెట్టలేకపోతున్న అనుష్క, త్వరలోనే సినిమాలకు గుడ్బై చెప్పనున్నట్లు టాలీవుడ్లో వార్త హల్చల్ చేస్తోంది.
అయితే అనుష్క నటించిన లేటెస్ట్ మూవీ ‘నిశ్శబ్దం’ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది.కానీ పలు కారణాల వల్ల ఆ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోవడం, ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతండటంతో అనుష్కకు సినిమాలపై ఆసక్తి పోయిందని మరో వర్గం క్రిటిక్స్ అంటున్నారు.
ఏదేమైనా తమ ఫేవరెట్ హీరోయిన్ ఇలా సినిమాలకు దూరం అవుతుందనే వార్తతో ఆమె అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం ఆమె అఫీషియల్గా అనౌన్స్ చేసే వరకు ఆగాల్సిందే.