ఆ విషయంలో అనుష్క తర్వాత శ్రియనే.. ఎందులో అంటే?

ఏదైనా సినిమా తీస్తున్నారు అంటే ఇటీవల కాలంలో హీరోస్ కి ఉన్న ప్రాధాన్యత హీరోయిన్స్ కి ఉండటం లేదు.ఏదో హీరోయిన్ ఒక బొమ్మల ఉండాలి అంటే ఉండాలి అనే సినిమాలు వచ్చాయ్.

 Anushka Shetty, Shriya Saran, Nishabdam, Gamanam-TeluguStop.com

అందుకే కొందరు హీరోయిన్లు వారి కోసమే ప్రత్యేక పాత్రల సినిమాలలో నటిస్తున్నారు.అలా నయనతార, అనుష్క, ఇప్పుడు శ్రీయ శరన్ తీస్తున్నారు.
ఒకప్పుడు మంచి టాప్ హీరోయిన్స్ ప్లేస్ లో నటించిన వీరు ఇప్పుడు ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తున్నారు.ఇక ఈ నేపథ్యంలో ఓ విషయంలో అనుష్క తర్వాత శ్రియనే అని చెప్తున్నారు.ఏ విషయంలో అంటే.1976లో కె.విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన ”సిరి సిరి మువ్వ” సినిమాలో జయప్రద మూగ పాత్రలో నటించి సూపర్ హిట్ చేసింది.

ఆతర్వాత కథానాయికలు ఎవరు కూడా మూగ పిల్ల పాత్రలో నటించిన సందర్భాలు లేవు.

కానీ ఇప్పుడు అందాల తార స్వీట్ అనుష్క నిశ్శబ్దం సినిమాలో మూగ అమ్మాయిలా నటించింది.కోన వెంకట్ నిర్మాతగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా రూపొందింది.

ఇప్పటికి అన్ని పనులు పూర్తి చేసుకున్నప్పటికి కరోనా వైరస్ కారణంగా సినిమా వాయిదా పడింది.

అయితే ఇప్పుడు శ్రీయ కూడా మూగ అమ్మాయిలా నటించనుంది.ఇప్పటికే మనం సినిమాలో నత్తి అమ్మాయిలా కనిపించి అందరిని అలరించిన ఈ హాట్ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్ లో కీలక పాత్రల్లో నటించనుంది.ఇంకా ఆమె కథానాయికగా తెరకెక్కుతున్న గమనం సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.

దీంతో అనుష్క తర్వాత మూగ పాత్రలో నటిస్తున్న హీరోయిన్ శ్రీయనే అని అంటున్నారు సినీ విశ్లేషకులు.మరి అనుష్క నిశ్శబ్దం, శ్రీయ గమనం ప్రేక్షకుల ముందకు ఎప్పుడు వస్తాయ్ అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube