టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి బాహుబలి చిత్రంతో ఎలాంటి స్థాయికి చేరుకుందో అందరికీ తెలిసిందే.లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్గా ఈ బ్యూటీ మారిపోయింది.
ఇక ఈ బ్యూటీ నటించిన లేటెస్ట్ మూవీ ‘నిశ్శబ్ధం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.అయితే పలు కారణాల వల్ల వరుసగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమాను వేసవి కానుకగా ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది.
కానీ కరోనా వైరస్ నిశ్శబ్ధం చిత్ర యూనిట్ ఆశలపై నీళ్లు జల్లింది.దీంతో ఈ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడింది.ఇక ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.కానీ ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పనులు అంతంతమాత్రంగా ఉండటంతో ఆ పనులను మరో కంపెనీకి అప్పగించిందట చిత్ర యూనిట్.
దీంతో ఇప్పుడు ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ను ఓటీటీలో కూడా అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేమని చిత్ర యూనిట్ భావిస్తోంది.
పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాను దర్శకుడు హేమంత్ మధుకర్ తెరకెక్కించగా కోనా వెంకట్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
కాగా ఈ సినిమాలో అనుష్కతో పాటు అంజలి, మాధవన్, షాలినీ పాండే తదితరులు నటిస్తున్నారు.మరి ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుందో తెలియాలంటే మాత్రం చిత్ర యూనిట్ అఫీషియల్గా అనౌన్స్ చేసే వరకు ఆగాల్సిందే.