బాగమతి సినిమా తరువాత అనుష్క నటిస్తున్న మరో డిఫరెంట్ ఫిల్మ్ నిశ్శబ్దం.గతంలో ఎప్పుడు లేని విధంగా వినూత్నసస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో అనుష్క ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఫైనల్ గ చిత్ర యూనిట్ సినిమా షూటింగ్ ని ఇటీవల ఫినిష్ చేసింది.
అమెరికా షెడ్యూల్ ను ఇటీవల పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ ఇప్పుడు విఎప్ఎక్స్ పనుల్లో బిజీ కానుంది.సినిమాలో ఆర్ట్స్ కి సంబందించిన సీన్స్ ఎక్కువగా ఆకట్టుకుంటాయట.అనుష్క రోల్ భయపెడుతూనే ఆశ్చర్యనికి గురి చేస్తుందట.
బాలీవుడ్ – కోలీవుడ్ లో కూడా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
అనుష్క బాలీవుడ్ లో స్పెషల్ ప్రమోషన్స్ కి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కోనవెంకట్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకుడు.ఇక సినిమాలో హాలీవుడ్ యాక్టర్ మైకేల్ అలాగే సీనియర్ యాక్టర్ మాధవన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.