టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకొని అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా కొనసాగుతున్న అందాల భామ అనుష్క.ఈ అమ్మడు గత ఏడాది చివరిగా నిశ్శబ్దం అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
అమెరికా నేపధ్యంలో తెరకెక్కిన ఆ సినిమాలో హాలీవుడ్ నటులు కూడా కీలక పాత్రలలో నటించాడు.మాధవన్ లాంటి టాలెంటెడ్ యాక్టర్ కూడా నటించాడు.
అతనే సినిమాలో మెయిన్ విలన్.సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన సినిమా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు.
భారీ అంచనాలతో రిలీజ్ అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.ఈ సినిమాని థియేటర్ లో రిలీజ్ చేసి ఉంటే నిర్మాతలు దారుణంగా నష్టపోయేవారని క్రిటిక్స్ సైతం చెప్పారు.
ఆ సినిమా తర్వాత మళ్ళీ అనుష్క లాంగ్ గ్యాప్ తీసుకుంది.
ప్రస్తుతం మళ్ళీ స్లిమ్ అయ్యి మునుపటి రూపం తెచ్చుకునే పనిలో పడ్డ అనుష్క మరో ఫ్లాప్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
అందులో రారా కృష్ణయ్య సినిమాతో దర్శకుడుగా మారిన మహేష్ చెప్పిన కథ నచ్చడంతో ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.మొదటి సినిమాతోనే డిజాస్టర్ కొట్టిన ఈ దర్శకుడు ఇంత వరకు రెండో సినిమా చేయలేకపోయాడు.
అయితే ఇప్పుడు అనుష్క తన కథకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిర్మాతలు కూడా లైన్ లోకి వస్తున్నారు.కోన వెంకట్ ఈ సినిమా వెనుక ఉన్నాడని తెలుస్తుంది.
ఇప్పటిమే హేమంత్ మధుకర్ లాంటి ఫ్లాప్ డైరెక్టర్ ని నమ్మి చేసిన నిశ్శబ్దం సినిమా డిజాస్టర్ అయ్యాక కూడా మళ్ళీ అనుష్క మరో ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అవ్వడం కొద్దిగా ఆలోచించాల్సిన విషయం అనే టాక్ టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది.