టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటి అనుష్క.అలాగే సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటిగా అనుష్క శెట్టి ఉంది.
గతంలో మాదిరి రెగ్యులర్ తరహా సినిమాలు సినిమాలు చేయకుండా ప్రెజెంట్ ఈ అమ్మడు కంటెంట్ బేస్ ఫిమేల్ సెంట్రిక్ కథలపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది.అయితే బాహుబలి తర్వాత అనుష్క నుంచి నిశ్శబ్దం సినిమానే ఇప్పటి వరకు వచ్చింది.
అయితే భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.ఈ కథని అనుష్క ఎలా ఒప్పుకుంది అనే కామెంట్స్ కూడా వినిపించాయి.
ఒటీటీలో అతి తక్కువ వ్యూయర్ షిప్ వచ్చిన సినిమాగా నిశ్శబ్దం నిలిచిపోయింది.అయితే కొంత గ్యాప్ తీసుకొని ఈ అమ్మడు మరో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్తుంది.
రారా క్రిష్నయ్య సినిమాతో దర్శకుడుగా మారి మొదటి ప్రయత్నంలోనే ఫెయిల్ అయిన మహేష్ దర్శకత్వంలో అనుష్క నెక్స్ట్ సినిమా చేయబోతుంది.మహేష్ చెప్పిన ఫిమేల్ సెంట్రిక్ స్టొరీ ఆమెకి నచ్చడంతో ఒకే చెప్పేసింది.
యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో సౌత్ బాషలలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది.
త్వరలో మూవీ సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తుంది.అయితే డిజాస్టర్ దర్శకుడుతో అనుష్క మళ్ళీ నిశ్శబ్దం లాంటి ప్రయత్నమే చేస్తుందా లేదంటే ఈ సారి సాలిడ్ హిట్ కొడుతుందా అనే డౌట్ ఆడియన్స్ లో ఉంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.త్వరలో సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు బయటకి వచ్చే అవకాశం ఉంది.