తెలుగులో విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా నటించి తన సత్తా ఏమిటో చూపించి నటువంటి నటి అనుష్క శెట్టి.ప్రస్తుతం అనుష్క నిశ్శబ్దం అనే చిత్రంలో నటిస్తోంది.
ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.నిర్మాత కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
ఈ చిత్రంలో విలక్షణ నటుడు మాధవన్ హీరోయిన్ అంజలి, శాలిని పాండే, మైకల్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.అలాగే ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్ సంగీత స్వరాలను సమకూరుస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఎటువంటి వార్తలను బయటకి పొక్కకుండా చిత్ర యూనిట్ సభ్యులు సైలెంట్ గా పని కానిచ్చేస్తున్నారు.కానీ ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్టు విషయం బయటకి పొక్కినట్లు తెలుస్తోంది.
ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ తో సాగే కథనంలో ఇంటర్వెల్ తర్వాత వచ్చేటువంటి ట్విస్ట్ మొత్తం సినిమాకే హైలెట్ గా ఉంటుందని అంతేగాక ఈ చిత్రంలో అనుష్క చేసినటువంటి ఓ హత్యని చేదించడంలో భాగంగా ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అంజలి నటిస్తుందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఈ వార్తలపై చిత్ర యూనిట్ సభ్యులు స్పందించడం మాట అటుంచితే కనీసం పట్టించుకోవడం కూడా లేదు.
అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు హేమంత్ ఈ నెల 20వ తారీఖున ప్రేక్షకుల ముందుకు తీయూకు రావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం అనుష్క టాలీవుడ్ లోని ఓ స్టార్ హీరో చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.
అయితే గత కొద్దికాలంగా అనుష్క కథల పరంగా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది.అందువలనే తన తదుపరి చిత్రాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.