టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత అక్కినేని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాధించుకుంది.ఏమాయ చేశావే సినిమాతో వెండి తెరకు పరిచయమైన ఈ బ్యూటి తన మొదటి సినిమానే సూపర్ హిట్ అవ్వడంతో ప్రేక్షకుల్లో తన క్రేజ్ను పెంచుకుంది.
నాగ చైతన్య హీరోగా నటించిన ఈ సినిమాకు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించాడు.పూర్తి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది.
ఇక ఈ సినిమా తెలుగులో బొంబాట్ హిట్ కావడంతో తమిళంలో విన్నాయ్ తాండి వరువాయా అనే టైటిల్తో హీరో శింబు, హీరోయిన్ త్రిషా జోడితో తెరకెక్కించారు.అక్కడ కూడా ఈ సినిమా సూపర్ సక్సె్స్ అయ్యింది.
ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనే ప్లాన్లో ఉన్నారు చిత్ర యూనిట్.ఈ సీక్వెల్ సినిమాలో శింభుతోనే తెరకెక్కించాలని, హీరోయిన్గా స్టార్ బ్యూటీ అనుష్కను తీసుకోవాలని దర్శకుడు గౌతమ్ మీనన్ అంటున్నారు.
ఇప్పటికే ఈ సీక్వెల్ కథకు కావాల్సిన స్క్రిప్టును రెడీ చేసిన డైరెక్టర్ శింభు డేట్ల కోసం చూస్తున్నాడట.పూర్తి లవ్ అండ్ యూత్ఫుల్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మరి స్వీటీని ఎందుకు ఎంచుకోవాలనుకుంటున్నాడో ఈ డైరెక్టర్ అర్ధం కావడం లేదని సినీ వర్గాలు అంటున్నాయి.
అటు అనుష్క మాత్రం చాలా బొద్దుగా మారి తన సినిమాలను నెమ్మదిగా చేసుకుంటూ వెళుతోంది.తాజాగా నిశబ్ధం అనే సినిమాతో మనముందుకు రావడాని అనుష్క రెడీ అవుతోంది.