టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నిశబ్దం తో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది.గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ అమ్మడి జోరు ఏమాత్రం కనిపించడం లేదు.
స్టార్ హీరోయిన్ ఇమేజ్ ఉన్నా కూడా సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది.భాగమతి సినిమా నిరాశ పర్చడంతో నిశబ్దం సినిమాకు దాదాపు రెండేళ్ల సమయం తీసుకుంది.
నిశబ్దం సినిమా పూర్తి అయ్యి ఏడాది దాటినా కూడా ఇప్పటి వరకు కొత్త సినిమాకు ఈమె కమిట్ అయ్యిందో కాలేదో తెలియడం లేదు.వరుసగా సినిమాలు చేయాల్సిన అనుష్క ఇలా పెద్దగా సినిమాలు చేయక పోవడం పట్ల స్వయంగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రికార్డు బ్రేకింగ్ వసూళ్లను దక్కించుకున్న భాగమతి సినిమా తర్వాత అనుష్క కెరీర్ మరింత పీక్స్ కు వెళ్లింది.కాని ఆమె మాత్రం సినిమాల ఎంపిక విషయంలో కాస్త డల్ గా ఉన్నట్లుగా అనిపిస్తుంది.
అనుష్క ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఏంటీ అంటే ఒక్కటి అంటే ఒక్కటి కూడా చూపేందుకు లేకుండా పోయింది.ఆమద్య రారా కృష్ణయ్య సినిమా దర్శకుడు మహేష్ దర్శకత్వంలో అనుష్క సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
కాని ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ విషయం పై ఎలాంటి వార్తలు రాలేదు.ఇక తాజాగా రమేష్ అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో సినిమాను చేసేందుకు అనుష్క ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా లేడీ ఓరియంటెడ్ మూవీగా ఈ సినిమాను అనుష్క చేయబోతుంది.
ఒక యంగ్ హీరో ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమా అయినా ముందు పడుతుందా లేదంటే ఇది కూడా మద్యలోనే మటాస్ అవుతుందా అనేది చూడాలి.
.