టాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న బ్యూటీ అనుష్క శెట్టి.ఒక్క అరుంధతి చిత్రంతో అమ్మడికి స్టార్ స్టేటస్ ఏ రేంజీలో వచ్చి పడిందో అందరికీ తెలిసిందే.
ఈ ఒక్క సినిమాతో స్టార్ హీరోలను సైతం వెనక్కి నెట్టిన ఈ బ్యూటీ ఆ తరువాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు బాగా పేరు సంపాదించుకుంది.
అయితే బాహుబలి సినిమాలో చేసిన దేవసేన పాత్రకు ఆమెకు ఎలాంటి గుర్తింపు వచ్చిందో అందరికీ తెలిసిందే.
ఈ సినిమా తరువాత అనుష్క పలు విమర్శలు ఎదుర్కొంది.అయితే ఈ సినిమా తరువాత కూడా అనుష్క తనదైన ముద్ర వేస్తూ చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.
ఇప్పటికే భాగమతి వంటి బ్లాక్బస్టర్ సినిమాతో మనముందుకు వచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు సరికొత్తగా నిశబ్దం అనే సినిమాతో రానుంది.అయితే ఈ సినిమా తరువాత మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించేందుకు పచ్చ జెండా ఊపిందట అనుష్క.
ఈ సినిమాలో అనుష్క మరోసారి మార్షల్ ఆర్ట్స్లో చెలరేగిపోనుందని తెలుస్తోంది.
ఏదేమైనా సినిమా అవకాశాలు కాస్త తగ్గగానే తనకు పేరుతెచ్చిన పాత్రల్లో మరోసారి నటించేందుకు అనుష్క పన్నాగాలు పండుతోంది.
మరి ఈ పాత్రల్లో మరోసారి అనుష్క మెప్పిస్తుందా లేదా అనేది చూడాలి.ఏదేమైనా ఈ సినిమాతో మరోసారి అనుష్క తన క్రేజ్ను సాధించుకునేందుకు సిద్ధమవుతున్న మాట మాత్రం వాస్తవం.