టాలీవుడ్ స్వీటీ అనుష్క నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నిశ్శబ్దం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.కాగా ఈ సినిమా పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు అనుష్క రెడీ అవుతోంది.ఈ సినిమాను దర్శకుడు హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
ఇక ఈ సినిమా తరువాత అనుష్క ఎలాంటి సినిమాలో నటిస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే అనుష్క ఓ భారీ పాన్ ఇండియా చిత్రంలో నటించేందుకు రెడీ అయ్యిందంటూ ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆదిపురుష్’ను ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ ప్రభంజనం సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు.
బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాను రామాయణం ఆధారంగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
అయితే ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండటంతో, సీత పాత్రలో ఎవరు కనిపిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ సినిమాలో సీత పాత్రలో నటించేందుకు స్వీటీ అనుష్కను తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని అనుష్క అంటోంది.
తనను ఈ సినిమాలో నటించేందుకు చిత్ర యూనిట్ తనను సంప్రదించలేదని అనుష్క చెప్పుకొచ్చింది.ఏదేమైనా ఆదిపురుష్ చిత్రంలో అనుష్క నటిస్తుందనే వార్తతో ఒక్కసారిగా ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయ్యింది.
మరి ఈ సినిమాలో సీత పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి.