దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనని వేదించే ప్రయత్నం చేశాడని, గదిలోకి తీసుకెళ్లి తనతో అసభ్యంగా ప్రవర్తించారని నటి పాయల్ ఘోష్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.ఈ ఆరోపణలతో ఒక్కసారిగా బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.
దాంతో మరల మీటూ అంటూ రచ్చ మొదలైంది.సోషల్ మీడియాలో కొంత మంది పాయల్ కి సపోర్ట్ గా అనురాగ్ పై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కంగనా రనౌత్ కూడా అనురాగ్ కశ్యప్ ని అరెస్ట్ చేసి పాయల్ కి రక్షణ కల్పించాలని ట్వీట్ చేసింది.ఇదిలా ఉంటే పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలపై అనురాగ్ కశ్యప్ తాజాగా స్పందించారు.
ఆమె వాఖ్యలపై స్పందించ వద్దని తన సన్నిహితులు చాలా మంది చెప్పారు.అయినా వాటిపై తన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ముందుకొచ్చా.
పాయల్ వాఖ్యలపై అనురాగ స్పందిస్తూ మీరు నాపై నిరాధారమైన ఆరోపణలు చేశారని చెప్పడానికి స్పందించాల్సి వస్తుంది.భవిష్యత్తులో వాస్తవం ఏంటి అనేది అందరికి తెలుస్తుంది.
మీరు ఓ మహిళ అయి ఉండి కూడా నాతో కొంతమంది నటీమణులకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.ఇది మీకు తప్పుగా అనిపించడంలేదా? నన్ను ఇబ్బందుల పాల్జేసే క్రమంలో మీరు బచ్చన్ ఫ్యామిలీ సహా మరికొందరు ఇతర హీరోయిన్లను ఇందులోకి లాగే ప్రయత్నం చేశారు.ఓ దర్శకుడిగా ఎంతోమంది హీరోయిన్లతో మాట్లాడుతుంటాను.అలాగని వాళ్లతో ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించలేదు.నేను రెండు వివాహాలు చేసుకోవడం తప్పని అంటే ఒప్పుకుంటాను కానీ ఇలాంటి ఆధారం లేని అబద్ధాలు చెబితే వాస్తవం అయిపోవు.ప్రతిదానికి కొన్ని హద్దులు ఉంటాయి.
అంటూ అనురాగ్ తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.ఇక ఈ విషయంలో తాప్సి అనురాగ్ కి మద్దతుగా నిలబడి ఆయన వ్యక్తిత్వానికి సర్టిఫికెట్ ఇచ్చింది.
అలాగే సయామీ గుప్తా కూడా అనురాగ్ కి మద్దతుగా పోస్ట్ పెట్టింది.