దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనని లైంగికంగా వేధించాడని నటి పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలు గురించి అందరికి తెలిసిందే.ఆడిషన్ కోసం వెళ్లిన తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక వేధింపులకి పాల్పడ్డాడు అంటూ సంచలన ఆరోపణలు చేసింది.
దీంతో బాలీవుడ్ లో మరల మీటూ ఉద్యమం మొదలైందనే అభిప్రాయం వచ్చింది.అయితే పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలకి అనురాగ్ కశ్యప్ స్పందించి సమాధానం చెప్పారు.
అనురాగ్ కశ్యప్ గురించి తెలిసిన చాలా మంది అతనిని కావాలనే పాయల్ టార్గెట్ చేసింది అనే విధంగా రియాక్ట్ అయ్యి అనురాగ్ కి మద్దతుగానిలబడ్డారు.ఇదిలా ఉంటే పాయల్ ఆరోపణలు, ఫిర్యాదు నేపధ్యంలో ముంబై పోలీసులు అతనికి నోటీసులు పంపించారు.
అనురాగ్ కశ్యప్ పోలీసుల విచారణకి హాజరయ్యాడు.
ఇదిలా ఉంటే తాజాగా అనురాగ్ కశ్యప్ ఒక స్టేట్మెంట్ ను విడుదల చేశారు.
తనపై పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధమని అన్నారు.మీటూ ఉద్యమాన్ని వ్యక్తిగత అవసరాల కోసం ఆమె ఉపయోగించుకుంటోందని మండిపడ్డారు.
న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేయాలనుకుంటున్న ఆమెపై చర్యలు తీసుకోవాలని అన్నారు.అనురాగ్ తరపున ఈ కేసును చూసుకుంటున్న లాయర్ ప్రియాంక ఖిమానీ మాట్లాడుతూ విచారణ సందర్భంగా కశ్యప్ ఒక డాక్యుమెంటరీ ఆధారాన్ని అందించారని చెప్పారు.2013 ఆగస్ట్ మాసం మొత్తం ఒక సినిమా షూటింగ్ కోసం శ్రీలంకలోనే ఉన్నట్టు ఆధారాలు ఇచ్చారని తెలిపారు.తనపై వచ్చిన ఆరోపణలను కశ్యప్ ఖండించారని చెప్పారు.
అయితే పాయల్ చెప్పిన ప్రకారం చూస్తే అనురాగ్ తాను ఎలాంటి తప్పు చేయలేదని పక్కా ఆధారాలతో సహా ప్రూవ్ చేసుకున్నారు.మరి దీనిపై పాయల్ ఘోష్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది వేచి చూడాలి.