ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్.తెలుగులో ఈ అమ్మడు ఆఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మకి తరువాత వరుసగా అవకాశాలు వచ్చి పడ్డాయి.కుర్ర హీరోలకి ప్రధాన ఛాయస్ గా అనుపమ మారిపోయింది.
శతమానం భవతి సినిమా తర్వాత ఆమె కెరియర్ లో వరుసగా ఫ్లాప్ సినిమాలు పడ్డాయి.దీంతో హీరోయిన్ రేస్ లో వెనుకబడిపోయింది.
మంచి నటన, లుక్స్ ఉన్న కూడా దర్శకులు సెంటిమెంట్ గా భావించి ఆమెని పక్కన పెడుతున్నారు.అయితే ఈ లోపు తన మాతృభాష అయిన మలయాళంలో వరుస సినిమాలు చేసింది.
ఆమె తెలుగులో చివరిగా నటించిన చిత్ర రాక్షసుడు.ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ కి జోడీగా చేసింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడుకి తెలుగులో మళ్ళీ వరుసగా అవకాశాలు వస్తున్నట్లు.తెలుస్తుంది
గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో నిఖిల్ హీరోగా 18 పేజెస్ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమా పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.లాక్ డౌన్ కి ముందే ఈ సినిమా అనౌన్స్మెంట్ జరిగింది.
లాక్ డౌన్ కారణంగా సెట్స్ పైకి వెళ్ళలేదు.మరల త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతుంది.
ఇక ఇందులో హీరోయిన్స్ గా చాలా మంది పేర్లు పరిశీలించారు.లావణ్య త్రిపాఠి, ప్రియాంకా ఆరుళ్ మోహన్, మాళవిక మోహన్ వంటి అందాల భామల పేర్లు పరిశీలించారు.
అలాగే ముందుగా అనుపమ పరమేశ్వరన్ ని అనుకున్నారు.ఫైనల్ గా చిత్ర యూనిట్ అనుపమనే హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది.
అలాగే కార్తికేయ 2లో కూడా హీరోయిన్ గా అనుపమనే చేస్తుంది.ఈమె తప్పుకున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చిన అలాంటిదేం లేదని తెలుస్తుంది.